21న రైతుల నిరాహార దీక్ష: హర్యానా హైవేపై 25 నుంచి టోల్టాక్స్ నిలిపివేత
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో హైవేలపై నిరసన చేపట్టిన రైతులు.. సోమవారం రోజు పూర్తిగా నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. అంతేగాక, డిసెంబర్ 25-27 వరకు టోల్ సేకరణ కూడా నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా పంజాబ్, హర్యానాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఢిల్లీ సరిహద్దులో హైవేలపై నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. చట్టాలను రద్దు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సోమవారం రోజు నిరసన ప్రదేశాల్లో రైతులంతా ఒక రోజు పూర్తిగా సోమవారం నాడు నిరాహార దీక్ష చేస్తారని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా కూడా రైతులు ఇదేవిధంగా నిరసనలు తెలియజేయాలని యాదవ్ కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హర్యానా ప్రభుత్వం నిరసన చేస్తున్న రైతులను బెదిరింపులకు గురిచేస్తోందని అన్నారు. ఢిల్లీ-హర్యానా సింఘ్ బోర్డర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దని అన్నారు.
మరో రైతు నేత జగజీత్ సింగ్ దలేవాల మాట్లాడుతూ.. సోమవారం నిరాహార దీక్ష అనంతరం డిసెంబర్ 25-27 వరకు హర్యానా హైవేపై టోల్ సేకరణ అడ్డుకుంటామని తెలిపారు. టోల్ బూత్ లను టోల్ టాక్స్ తీసుకోకుండా అడ్డుకుంటామని చెప్పారు. డిసెంబర్ 23న కిసాన్ దివాస్ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక రోజుపాటు ఎవరూ కూడా వంట చేయవద్దని పిలుపునిచ్చారు. కాగా, నిరసనలో పాల్గొంటూ మృతి చెందిన రైతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications