ఎర్రకోటపై సిక్కు జెండా జాతికి అవమానం -సీజేఐ సుమోటోగా -రైతుల ర్యాలిలో టెర్రర్ చర్యలంటూ
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తోన్న రైతులు.. మంగళవారం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాయుతంగా ముగిసింది. పోలీసులు నిర్ధేశించిన రూట్లలో కాకుండా, ఇతర మార్గాల్లో ట్రాక్టర్లు దూసుకురావడం, వాటిని బలగాలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఘర్షణ చెలరేగడం, ప్రమాదవశాత్తూ ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన తర్వాత.. కొందరు ఎర్రకోటలోకి ప్రవేశించి సిక్కు మతానికి చెందిన జెండాలు ఎగరేయడం లాంటివి కలకలం రేపాయి. కాగా,
రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ హింసాకాండ చోటుచేసుకుందని, దేశప్రతిష్ట దిగజారేలా కొనసాగిన అరాచకశక్తులు పేట్రేగిపోయాయని, వీటికి సంబంధించిన అన్ని అంశాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరుతూ డిమాండ్ వ్యక్తమైంది. ముంబై యూనివర్సిటీ న్యాయ విధ్యార్థిని అశిష్ రాయ్ మంగళవారం ఈ మేరకు సీజేఐ బోబ్డేకు లేఖ రాశారు.

జాతీయ చిహ్నామైన ఎర్రకోటపై జాతీయ జెండా స్థానంలో సిక్కు మతానికి చెందిన జెండాను ఎగరేయడం దేశాన్ని అవమానించడమేనని, అది కూడా రిపబ్లిక్ డే నాడు జరగడం రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్లయిందని, పోలీసులపై దాడులు కూడా గర్హనీయమని, మొత్తం హింసాకాండపై సీజేఐ సుమోటోగా పరిశీలన జరపాలని రాయ్ లేఖలో కోరారు. ఇదిలా ఉంటే..
రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పలు చోట్ల ఘర్షణలు జరగ్గా, 18 మంది పోలీసులు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో నగరంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు బలగాలను దింపుతోంది. సుమారు 15 కంపెనీల పారామిలిటరీ దళాలను దిల్లీలో మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో దాదాపు 1500 మంది జవాన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. 10 కంపెనీల సీఆర్పీఎఫ్, 5 కంపెనీల రెండవ తరహా.. పారామిలిటరీ బలగాలు మోహరించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా,

ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రైతు సంఘాలు విచారం వ్యక్తంచేశాయి. సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఎలాంటి హింసాత్మక చర్యలకు, జాతీయ చిహ్నాలు, గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించకూడదని ముందుగానే హెచ్చరించినట్టు రైతు నేతలు ప్రకటనలో తెలిపారు. హింస జరిగిన ప్రాంతాల్లో, ఎర్రకోటపై జెండా వ్యవహారంలో రైతులెవరూ పాలుపంచుకోలేదని వారు స్పష్టం చేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications