Daughter: కూతుర్ని చంపేసి హైవేలో శవాన్ని విసిరేసిన తండ్రి, లవ్ ఎఫెక్ట్ ?, 20 వేల ఫోన్ కాల్స్ ట్రాక్ !
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు సంచరిస్తుంటాయి. యమునా ఎక్స్ ప్రెస్ హైవేలోని మధురా సమీపంలో ఎర్రటి పెద్ద ట్రాలీ బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం నుంచి ఆ బ్యాగ్ రోడ్డు పక్కనే ఉంది. ఎంతసేపు అయినా ట్రాలీ బ్యాగ్ ఎవ్వరూ తీసుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారు. పోలీసులు ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో యువతి శవం ఉంది. 20 వేల ఫోన్ కాల్స్ ట్రాక్ చేసిన పోలీసులు హత్యకు గురైన యువతి ఆచూకి తెలుసుకున్నారు. యువతి హత్య కేసులో ఆమె తండ్రినే పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
Girlfriend: ప్రియురాలిని ముక్కలుగా నరికి 6 కిలోమీటర్లు తల ఎత్తుకెళ్లిన మాజీ బాయ్ ఫ్రెండ్, యవ్యారం !
హైవేలో నిత్యం రద్దీ
ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేలో నిత్యం వాహనాలు సంచారంతో ఆ రోడ్డు రద్దీగా ఉంటుంది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేలోని మధురా సమీపంలో ఈనెల 18వ తేదీన గుర్తు తెలియనివాళ్లు ట్రాలీ బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు.
20 వేల ఫోన్ కాల్స్ తో యువతి అడ్రస్ చిక్కింది
యువతిని హత్య చేసి తరువాత ఆమె శవాన్ని ట్రాలీ బ్యాగ్ లో తీసుకు వచ్చి వదిలేశారని పోలీసులు గుర్తించారు. ఈనెల 17వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆ ప్రాంతంలో సంచరించిన వారికి చెందిన 20 వేల ఫోన్ కాల్స్ ను పోలీసు అధికారులు ట్రాక్ చేశారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు హత్యకు గురైన యువతి ఢిల్లీకి చెందిన ఆయుషి యాదవ్ అలియాస్ ఆయుషి (21) అని గుర్తించారు.
మిస్సింగ్ కేసు పెట్టకుండా సైలెంట్
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢిల్లీలోని బదర్ పూర్ లో నివాసం ఉంటున్న నితీష్ యాదవ్ కుమార్తె అని తెలుసుకోవడానికి పోలీసులు నానా తంటాలుపడ్డారు. చివరికి అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి మీ అమ్మాయి ఆయుషి యాదవ్ హత్యకు గురైయ్యిందని అని చెబితే ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫీలింగ్ లేకుండా సైలెంట్ గా ఉండటంతో పోలీసులకు అనుమానం పెరిగిపోయింది.
యువతిని చంపిన తండ్రి...... రోడ్డు పక్కన శవం విసిరేశాడు
పోలీసులకు అనుమానం వచ్చి నితీష్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. తన కూతురు ఆయుషి యాదవ్ ఈనెల 17వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిందని, అదే రోజు రాత్రి తాను ఆమెను చంపేశానని నితీష్ యాదవ్ పోలీసులకు చెప్పాడు. తరువాత తన కారులోనే ఆయుషీ యాదవ్ శవాన్ని ట్రాలీ బ్యాగ్ లో తీసుకు వచ్చి యమునా ఎక్సెప్రెస్ హైవే మీద విసిరేశానని నితీష్ యాదవ్ అంగీకరించాడు.
పరువు హత్యా ?, లేక ఏం జరిగింది
ఆయుషీ యాదవ్ తక్కువ కులం వాడి ప్రేమలో పడిందని, కూతురు అతన్ని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని నితీష్ యాదవ్ ఆమెను హత్య చేసి ఉంటాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయుషీ యాదవ్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, ఆమె తండ్రి నితీష్ యాదవ్ ను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.