కూతురిపై అత్యాచారం: తండ్రికి పదేళ్ల జైలు శిక్ష
బెంగళూరు: కామంతో కళ్లు ముసుకుపోయి సోంత కుమార్తె మీద అత్యాచారం చేసిన తండ్రికి న్యాయస్థానం 10 పంవత్సరాలు జైలు శిక్ష విదించింది. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలుకా బండిపుర సమీపంలోని మేలుకామనహళ్ళి గ్రామానికి చెందిన శివకుమార్ శిక్షకు గురైనాడు. ఇతను తమిళనాడులోని ఊటిలో ఉన్న చెప్పుల ఫ్యాక్టరిలో పని చేస్తున్నాడు.
కొన్ని సంవత్సరాల క్రితం శివకుమార్ భార్య మరణించింది. ఇతనికి 17 సంవత్సరాల కుమార్తె ఉంది. అప్పుడప్పుడు ఇతను ఊటి నుండి సోంత గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. 2013 అక్టోబర్ 29వ తేదిన శివకుమార్ సోంత గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో శివకుమార్ తల్లి పోలం దగ్గరకు వెళ్లింది. ఇంటిలో ఒంటరిగా ఉన్న సోంత కుమార్తె మీద శివకుమార్ కన్ను పడింది.
అంతే కామంతో రెచ్చిపోయి కుమార్తె మీద అత్యాచారం చేశాడు. బెదిరించి రెండు మాడు సార్లు అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తున్న సమయంలో శివకుమార్ తల్లి వచ్చి చూసింది. తన కుమారుడు మనువరాలి మీద అత్యాచారం చేశాడని సోంత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు శివకుమార్ ను అరెస్టు చేశారు. వైద్య పరిక్షలలో శివకుమార్ కుమార్తె మీద అత్యాచారం చేశాడని రుజువు అయ్యింది. చామరాజనగర జిల్లా కోర్టు కేసు విచారణ చేసింది. శివకుమార్ నేరం చేశాడని ఆదారాలు గుర్తించిన న్యాయమూర్తి కామాంధుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 30 వేలు జరిమాన విదించారు. నిందితుడిని చామరాజనగర జిల్లా కోర్టుకు తరలించారు.