ఆపరేషన్ సింధూర్ వేళ బ్యాంకింగ్ సేవలపై కేంద్రం కీలక ఆదేశాలు- ఇక నుంచి..!!
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.
దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ.. నగదు నిల్వల పైన కేంద్రం అప్రమత్తం అయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు స్పష్టం చేసింది. బ్యాంకులు అప్రమ త్తంగా ఉండాలని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. వినియోగదారులకు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసారు.
ఆపరేషన్ సింధూరం.. భారత్ - పాక్ ఉద్రిక్తతల వేళ ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకు ల కు కీలక ఆదేశాలు ఇచ్చారు. అంతరాయం లేని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను నిర్మలా ఆదేశించారు. సైబర్ భద్రత సన్నద్ధతపై ఆర్బీఐ, బ్యాంకులు ఎన్పీసీఐ, బీమా సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ మేరకు కీలక సూచనలు చేశారు. సవాళ్లతో కూడిన సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధరించడంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో నగదు లావా దేవీలు.. విత్ డ్రాల పైన జరుగుతన్న ప్రచారాన్ని ఖండిస్తూ వినియోగదారులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశం ద్వారా బ్యాంక్ కార్యాలయాలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని చెప్పిన నిర్మలా ..డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. ఏటీఎంలలో సరిపడా నగదును అందుబాటులో ఉంచాలన్నారు. యూపీఐ సర్వీసులు సజావుగా సాగేలా జాగ్రత్త వహించాలని. ఆకస్మిక పరిస్థితు లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత కోసం చొరవ చూపాలని సూచించారు. ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో కచ్చితంగా సమన్వయం చేసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల ప్రతినిధులను ఆదేశించారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications