చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీకి మరో షాక్
ఎయిర్ ఇండియా ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించి, దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పైన ఈ రోజు సాయంత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించి, దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పైన ఈ రోజు సాయంత్రం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎయిర్ ఇండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు తాము ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగిపై దాడి చేసిన అనంతరం తాను ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టానని ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కూడా చెప్పారు.

ఇప్పటికే ఆయన విమానాల్లో తిరగకుండా ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానాయాన సంస్థలు ఆయన పేరును బ్లాక్ లిస్టులో పెట్టాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడతో ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారు.












Click it and Unblock the Notifications