జార్ఖండ్లో ముగిసిన తొలి విడత పోలింగ్: ఓటేసిన ధోనీ, పోలింగ్ శాతం ఎంతంటే?
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలకు గానూ బుధవారం 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన సతీమణి కల్పనతో కలిసి రాంచీలో ఓటు వేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి రాంచీ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ధోనీ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. భారీ ఎత్తున అభిమానులు ధోనీ చుట్టూ చేరి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కాగా, ఓటర్ టర్నవుట్ ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 64.86 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.

జార్ఖండ్లో తొలి విడత ఎన్నికల్లో జేఎంఎం నుంచి 23 మంది పోటీ చేయగా.. మిత్రపక్షాలైన కాంగ్రెస్ నుంచి 17 మంది, అర్జేడీ నుంచి ఐదుగురు బరిలో ఉన్నారు. ఇక, బీజేపీ నుంచి 36 మంది అభ్యర్థులు బరిలో దిగారు. జేడీయూ నుంచి ఇద్దరు పోటీ చేశారు. బీఎస్పీ నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
#WATCH | Former Indian cricket team captain MS Dhoni casts his vote at a polling booth in Ranchi for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/tNIkwoXIiy
— ANI (@ANI) November 13, 2024
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం చంపై సోరెన్, ఆయన తనయుడు బాబూలాల్ సోరెన్, మాజీ సీఎం అర్జున్ ముండా సతీమణి మీరా మొండా, మధు కోడా సతీమణి గీత కోడా, రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమ సాహు వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
#WATCH | Former Indian cricket team captain MS Dhoni along with his wife, Sakshi arrives at a polling booth in Ranchi to cast his vote for #JharkhandAssemblyElections2024 pic.twitter.com/KlD68mXdzM
— ANI (@ANI) November 13, 2024
కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు జేఎంఎం, కాంగ్రెస్ ఇండి కూటమి శాయశక్తులా ప్రయత్నిస్తుండగా.. ఈసారి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్వశక్తులూ ఒడ్డుతోంది. జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.
మరోవైపు, కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంతోపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వయనాడ్లో 60.79 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కాగా, వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications