మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలకు లైన్ క్లియర్.. 37 వేల కోట్లకు పైగా కేటాయించనున్న కేంద్రం
ఢిల్లీ : మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలను తిరిగి తెరిపించేలా లైన్ క్లియరైంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. యూరియా దిగుమతులను తగ్గించే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మూతపడ్డ ఐదు ఎరువుల కర్మాగారాలను తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటి పునరుద్ధరణకు 37 వేల 971 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రకటించారు.

లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా కేంద్రమంత్రి సదానంద గౌడ.. ఎరువుల అంశంపై మాట్లాడారు. దేశంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 305 మెట్రిక్ లక్షల టన్నుల యూరియా అవసరముండగా 241 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని చెప్పుకొచ్చారు. మిగతాదంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదేనని వెల్లడించారు.
ఆ క్రమంలో విదేశాల నుంచి యూరియా దిగుమతులు తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులోభాగంగానే ఐదు రాష్ట్రాల్లో మూతపడ్డ ఎరువుల కార్మాగారాలను తిరిగి తెరిపించనున్నట్లు పేర్కొన్నారు. వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం త్వరలోనే నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications