AOB encounter: విశాఖలో భారీ ఎన్కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి?
విశాఖపట్నం: ఏవోబీలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మధ్యాహ్నం వార్తలు అందే సమయానికి ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరిన్ని పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డాయి. ఏవోబీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో ఇటీవలే ఈస్ట్ జోన్ నుంచి వచ్చిన అరుణ మృతి చెందినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమ్మిరేులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్ దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన మావోయిస్టుల కాల్పుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏడాదికి ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications