పొంతన లేదు!: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో మలుపు! తల్లి ఇంద్రాణి కూతురు షీనా బోరాను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మొదటి నుంచి పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా సోమవారం నాడు మరో ట్విస్ట్ వెలుగు చూసింది.
2012లో అటవీ ప్రాంతంలో పెన్ స్టేషన్ పోలీసులు షీనా బోరాదిగా భావిస్తున్న బాగా కాలిపోయి ఉన్న మృతదేహం నుంచి సేకరించిన ఎముకల నమూనాలకు... ఇటీవల అదే చోటికి వెళ్లి మరోసారి తీసుకువచ్చిన నమూనాలకు ఎక్కడా పొంతన లేదని ఫొరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.

అవి రెండూ సరిపోలడం లేదన్నారు. ఇక్కడి బీవైఎల్ నాయర్ హాస్పిటల్కు చెందిన ఫొరెన్సిక్ నిపుణులు ఈ మేరకు 26 పేజీల నివేదికను ఖర్ పోలీసు స్టేషన్కు ఇచ్చారు. షీనా బోరా హత్యకేసులో నిందితుల జ్యుడీషియల్ కస్టడీని సంబంధిత కోర్టు అక్టోబరు అయిదవ తేదీ వరకూ పొడిగించింది.
షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఒకప్పుడు ఆమె వద్ద డ్రైవరుగా పని చేసిన శ్యామ్ రాయ్లు ప్రస్తుతం వేర్వేరు జైళ్లలో ఉన్నారు. దాంతో, ముగ్గురు నిందితులనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications