Imphal: ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తు తెలియని వస్తువు.. మూడు గంటలకు పైగా గందరగోళం..
ఇంఫాల్(Imphal) విమానాశ్రయంలో మూడు గంటలకు పైగా గందరగోళం నెలకొంది. ఎయిర్ పోర్టు సమీపంలో గుర్తు తెలియని వస్తువు గాల్లో ఎగురుతూ కనిపించింది. దీంతో విమానాలను దారి మళ్లీంచారు. రన్అవే సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు ఉందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారులు రెండు ఇన్కమింగ్ విమానాలను ఒకటి కోల్కతా, మరొక విమానాన్ని గౌహతి వైపు మళ్లించారు. విమానాశ్రయ అధికారులు వెంటనే మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని "నియంత్రిత గగనతలం"ను మూసివేశారు.
ఆ తర్వాత అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. దాదాపు 1,000 మంది ప్రయాణికులు గగనతలం మూసివేతతో ప్రభావితమయ్యారని వర్గాలు తెలిపాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) గగనతల నియంత్రణను భారత వైమానిక దళం (IAF)కి అప్పగించింది. రంగంలోకి దిగిన భారత వైమానిక దళం (IAF).. తన రాఫెల్ యుద్ధ విమానాలతో మోహరించింది. ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న UFO గురించి సమాచారం అందిన వెంటనే, సమీపంలోని ఎయిర్బేస్ నుంచి ఒక రాఫెల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్లి దాని కోసం వెతకడానికి ప్రయత్నాలు చేసింది.

"ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) మరియు మైదానంలో ఉన్న వ్యక్తులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువును చూశారు.ఆ తర్వాత మూడు విమానాలు - రెండు ఎయిర్ ఇండియా,ఒక ఇండిగో విమానం - టేకాఫ్ చేయవద్దని చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. అదే సమయంలో వచ్చే రెండు విమానాలను దారి మళ్లించారు" అని అధికారులు తెలిపారు. విమానాశ్రయం చుట్టూ కొండలు ఉన్నప్పటికీ - నైట్ ల్యాండింగ్ సామర్థ్యం ఉన్నందున దారి మళ్లించిన విమానాలు ఈ రాత్రికి ఇంఫాల్ చేరుకున్నాయి.
ఇంఫాల్ విమానాశ్రయం డైరెక్టర్ చిపెమ్మి కీషింగ్ ఒక ప్రకటనలో డ్రోన్ను చూసినట్లు ధృవీకరించారు. "కాంపిటెంట్ అథారిటీ" సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మూడు విమానాలు బయలుదేరాయని అధికారి తెలిపారు. సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల సమయంలో విమానాలు ఒకదాని తర్వాత ఒకటి టేకాఫ్ అయ్యే వరకు వారిలో చాలా మంది ఎయిర్పోర్ట్ లోపల ఉన్నారని, మరికొందరు విమానం లోపల మూడు గంటల పాటు ఉన్నారని ప్రయాణికులు చెప్పారు.

"మధ్యాహ్నం 3 గంటలకు బోర్డింగ్ పూర్తయింది, కానీ చివరకు సాయంత్రం 6.10 గంటలకు మాకు టేకాఫ్ క్లియరెన్స్ వచ్చింది. ప్రయాణికులు ఆందోళన చెందారు మరియు కొంతమంది వృద్ధులు ఆందోళన చెందారు, కానీ అందరూ చాలా సహకరించారు మరియు ఓపికగా ఉన్నారు" అని ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన ఒక మహిళ చెప్పారు. తాము చాలా సేపు కూర్చున్నందున టేకాఫ్కు ముందు విమానం లోపల ఆహారం అందించామని మరో ప్రయాణికురాలు చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications