ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్
ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు.
ముంబై: ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు.
బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్టీ నాయకత్వానికి రాజీనామా పంపినట్లు చెప్పారు.
ఈ రోజు (గురువారం) ఫలితాలు వచ్చాయి. అయితే, ఎగ్జిట్ ఫోల్ మాత్రం బీజేపీ, శివసేన హవా ఉంటుందని తేల్చి చెప్పాయి. దీంతో తాను బుధవారం నాడే రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించానని చెప్పారు.

అంతేకాదు, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని కూడా తాను అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి పైన చర్యలు తీసుకోకుంటే పార్టీకి పెద్ద నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అయితే, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేశఆరో ఆయన చెప్పలేదు.
గత కార్పోరేషన్ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో తక్కువ సీట్లు గెలుచుకుంది.
ఈసారి జరిగిన ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బీజేపీ 84 సీట్లు, శివసేన 84 సీట్లు, కాంగ్రెస్ 32 సీట్లు, ఎంఎన్ఎస్ 8 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications