బెంగళూరుకు తాగునీరు ఇవ్వకపోతే ?, సీఎంకు వార్నింగ్, స్టాలిన్ తో డీల్ మాట్లాడి ? మాజీ సీఎం !
బెంగళూరు/చెన్నై: కావేరి నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే బెంగళూరులోని స్వామీజీలు, రైతులు, పౌరులు తిరుగుబాటు చేస్తారని కర్ణాటక మాజీ సీఎం (cm) బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కావేరి జలాల పంపిణిపై బీజేపీ తదుపరి పోరాటంపై బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో బసవరాజ్ బోమమ్మయ్ నేతృత్వంలో కావేరి పరివాహక జిల్లాల బీజేపీ (bjp) పదాధికారుల సమావేశం నిర్వహించారు.
మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బసవరాజ్ బోమ్మయ్ కావేరి (cauvery) సమస్యపై కాంగ్రెస్ (congress) ప్రభుత్వం పెను ప్రమాదం తెచ్చిందన్నారు. ఇది మొదటి నుండి అడ్డంకిగా ఉంది. సుప్రీంకోర్టులో సరిగ్గా వాదించకుండానే 7.5 టీఎంసీల నీరు తమిళనాడుకు వదిలే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం (cauvery) మాత్రం ఏం చేయాలో ప్రజలకు చెప్పలేదని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బీజేపీ సీరియస్గా తీసుకుందని, కావేరీ (cauvery) పరీవాహక జిల్లాల్లో నిరసనలు తెలుపుతామని బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటకలోని సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ (congress) ప్రభుత్వం మొదటి నుంచి ఉచిత హామీల పేరు చెప్పి ఇప్పుడు సగంలో షరతులను అమలు చేస్తుందని బసవరాజ్ బోమ్మయ్ (bjp)ఆరోపించారు.
బెంగళూరు అంతర్జాతీయ నగరం, బ్రాండ్ బెంగళూరు అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అయితే బెంగుళూరు తాగునీరు (cauvery) గురించి మాట్లాడరు. మాకు కావాల్సింది ఉచిత హామీలు కాదని, తాగునీటి హామీలు అని, బెంగళూరు (bengaluru)కు ప్రత్యేకంగా 4.5 టీఎంసీల నీరు ఇవ్వాలని ట్రిబ్యునల్ (cauvery) కూడా చెప్పిందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని బసరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.

తమిళనాడు అక్రమంగా పంటలు పండించేందుకు అదనపు నీటిని (cauvery) వినియోగించుకుందని, కర్ణాటక ప్రభుత్వం దీనిపై నోరు మెదపలేదని, మనకు రుతుపవనాలు ముగిశాయని, రాబోయే రోజుల్లో తమిళనాడులో వర్షాలు (cauvery) కురుస్తాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని, దీనిపై మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నామని మా మీద ఎదురుదాడికి దిగుతున్నారని కాంగ్రెస్ (congress) పార్టీ మీద బసవరాజ్ బెమ్మయ్ మండిపడ్డారు.

తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సిద్దరామయ్య ప్రభుత్వంలోని నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, తమిళనాడు సీఎం (cm) స్టాలిన్ తో మాట్లాడండి అంటే నో టాక్ అంటూ గుడ్డిగా బదులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం వైపు వేలు ఎత్తి చూపిస్తున్నారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. సిద్ధరామయ్య (cm)చాలా నిపుణుడని, కరువు వస్తే (cauvery) కేంద్రం వైపు వేలు ఎత్తి చూపిస్తున్నారని బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. కానీ (cauvery) మీరు ప్రజలకు ద్రోహం చేసారు, ప్రభుత్వ వైఫల్యాలను ఖండిస్తూ రేపు (శనివారం) బెంగళూరులోని మైసూర్ బ్యాంక్ సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని, రానున్న రోజుల్లో 28 లోక్సభ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని (cauvery) మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ (bjp) కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications