సీఎం కుర్చీ ఎప్పుడు పోతుందో తెలీదు, ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలీదు !
బెంగళూరు/మండ్య: కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడు బద్దలవుతుందో తెలియదని, సీఎం కుర్చీలోని నాలుగు కాళ్లలో సిద్దరామయ్య రెండు కాళ్లు, డీకే. శివకుమార్ రెండు కాళ్లు పట్టుకుని లాగుతున్నారని, ఆ కుర్చీ ఎప్పుడు పడిపోతుందో తెలియదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్ణాటకలోని మండ్యాలోని కాళికాంభ కమ్యూనిటీ భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాజీ సీఎం సదానందగౌడ మాట్లాడారు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోరుబాట పట్టిస్తోందన్నారు. అంతా కేంద్రం వైపే చూపిస్తున్నారని మాజీ సీఎం సదానందగౌడ మండిపడ్డారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పనులన్నింటినీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం వదిలేసిందని, ఆ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు గుర్తు చేసుకుంటే మంచిదని సదానంద గౌడ అన్నారు.

సాధారణంగా చట్టాలను సవరించడం ఆనవాయితీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసే స్థాయికి వెళ్లడం సిగ్గుచేటని సిద్దరామయ్య ప్రభుత్వం మీద మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 నుంచి మంచి పనులు అమలు చేస్తోందని, కేంద్ర మంత్రివర్గంలోని ఏ ఒక్క మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు లేవని, . 2013లో 252 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019లో 320కి పైగా సీట్లు గెలుచుకుందని సదానంద గౌడ గుర్తు చేశారు.

2024లో 350 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని సదానందగౌడ చెప్పారు. కర్ణాటకలో ఓడిపోయాం అని బీజేపీ కార్యకర్తలు బాదపడకూడదని, వాజ్పేయి కూడా ఓడిపోయారని, మీరు నిరుత్సాహపడకండి, ఓడిపోయిన చోటి నుంచి మళ్లీ మనం గెలవాల్సిన సమయం ఆసన్నమైందని, మండ్య, బెంగళూరు రూరల్, హాసన్ నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని సదానంద గౌడ బీజేపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కినందుకు కాంగ్రెస్ పశ్చాత్తాపపడుతోందని, సీఎం సిద్ధరామయ్య మూలుగుతున్నారని, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని పాకులాడుతున్నారని మాజీ సీఎం సదానంద గౌడ విరుచుకుపడ్డారు
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications