మంత్రి రామలింగా రెడ్డి పెద్ద మూర్ఖుడు, మాజీ డీసీఎం సంచలన వ్యాఖ్యలు, నిజంగా!
బెంగళూరు/శివమొగ్గ: శివమొగ్గ (shimoga) అల్లర్లలో హిందూ కార్యకర్తలు వాళ్ల వేషధారణలు మార్చి రాళ్లు రువ్వారని వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిపై కర్ణాటక మాజీ డీసీఎం, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప విరుచుకుపడ్డారు. ఈ విషయమై శివమొగ్గలో మీడియాతో మాట్లాడిన ఈశ్వరప్ప రామలింగారెడ్డి మాజీ హోమ మంత్రి అని, ఆయన వెనుకా ముందు ఆలోచించకుండా మాట్లాడుతున్నారని ఈశ్వరప్ప ఆరోపించారు..
రామలింగారెడ్డి అని పేరు పెట్టుకున్న మంత్రి ఇలాంటి నిరాధారమైన ప్రకటనలు చేయకూడదని,, రామలింగారెడ్డి తాను మూర్ఖుడు అని ఒప్పుకుని కర్ణాటక రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేఎస్ ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. నిందితుల చేతుల్లో దెబ్బలు తిన్న వారి ఇంటికి నేనే మంత్రి రామలింగారెడ్డిని తీసుకెళ్తానని, బీజేపీ వేషధారణలో (shimoga) వచ్చి దాడి చేసిందని ఎస్పీ చెబితే రామలింగారెడ్డి చెప్పినట్లు తాను వింటానని ఈశ్వరప్ప సవాలు చేశారు.

సంఘటనా స్థలాన్ని (shimoga) సందర్శించిన మంత్రి మధు బంగారప్ప చెబితే నమ్ముతాను. రామలింగారెడ్డి (reddy) బెంగళూరులో ఎక్కడో కూర్చొని ఇలా మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ మౌనంగా ఉండరని ఈశ్వరప్ప అన్నారు. మంత్రి రామలింగారెడ్డి మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని, ఆయన గురించి మేము పట్టించుకోమని కేఎస్ ఈశ్వరప్ప అన్నారు.
మధు బంగారప్పపై రామలింగారెడ్డికి నమ్మకం లేదని, జైల్లో ఉన్న ముస్లిం గూండాలను వదిలేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఈశ్వరప్ప ఆరోపించారు. రాగిగూడ (shimoga) ఘటనా స్థలానికి నిజనిర్ధారణ కమిటీ సందర్శించనుందని, దాడికి గురైన కుటుంబానికి ధైర్యం చెబుతామని, డీజే హళ్లి కేజీ హళ్లి ఘటన, హుబ్బళి ఘటన కేసును ఉపసంహరించుకునే అంశంపై చర్చిస్తామని మాజీ డీసీఎం ఈశ్వరప్ప తెలిపారు.












Click it and Unblock the Notifications