హైకమాండ్ మీద మాజీ సీఎం ఫైర్, ఇలాగే ఉంటే ఎన్నికల్లో జెండాపై కపిపారాజు, సార్ చూడండి !
బెంగళూరు: బీజేపీ హైకమాండ్పై కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ ఎంపీ సదానంద గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ హైకమాండ్ కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ నాయకులను ఏ విషయంలోనే పట్టించుకోవడంలేదని, వారి మాటలకు విలువ ఇవ్వడం లేదని మాజీ సీఎం సదానందగౌడ సంచన వ్యాక్యలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తరువాత కర్ణాటక బీజేపీ నేతల సలహాలు, సూచనలను వినడంలో బీజేపీ హైకమాండ్ విఫలం అయ్యిందని డీవీ సదానంద గౌడ ఆరోపించారు. బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గం ఎంపీ సదానంద గౌడ ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్పై మాజీ సీఎం సదానంద గౌడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

కర్ణాటక బీజేపీ నేతలపై కేంద్ర నాయకత్వం ఎలాంటి ద్వేషాలు పెట్టుకోరాదని మాజీ సీఎం సదానందగౌడ మనవి చేశారు. కర్ణాటక నేతలను బీజేపీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకోకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం అని డీవీ సదానందగౌడ జోస్యం చెప్పారు. కేంద్రంలోని బీజేపీ నేతలపై కర్ణాటక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని డీవీ సదానందగౌడ అన్నారు.
వివిధ కారణాల వల్ల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట వాస్తవమే అని, దీంతో ఆగ్రహించిన కేంద్ర నేతలు కర్ణాటకలో అడుగుపెట్టడం మానేశారని, ప్రతిపక్ష నేతలు, పార్టీ అధ్యక్షుల నియామకాల్లో జాప్యం చేయడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి సదానందగౌడ విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు తీసుకుంటున్న చర్యలు పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సదానందగౌడ అన్నారు.
మాజీ సీఎం సదానంద గౌడ విలేకరుల సమావేశం ముగిసిన కొన్ని గంటల తర్వాత బీజేపీ హైకమాండ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను రాష్ట్ర శాఖ చీఫ్గా నియమించింది. నళిన్ కుమార్ కటీల్ పదవీ కాలం గతేడాది ఆగస్టుతో ముగిసింది. ఆ తర్వాత మే నుంచి బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అయితే కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు.

గత జూలైలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ శాసనసభలో పార్టీ తాత్కాలిక నేతగా నియమితులయ్యారు. కర్ణాటక బీజేపీ నేతలతో చర్చలు జరపాలని సదానంద గౌడ బీజేపీ హైకమాండ్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కూడా కర్ణాటక నేతలను విశ్వాసంలోకి తీసుకోవాలని కేంద్ర నేతలకు మాజీ సీఎం సదానందగౌడ విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆసక్తిగా పనిచేస్తామని, బీజేపీ విజయానికి పని చేస్తామని సదానందగౌడ బీజేపీ హైకమాండ్ కు హామీ ఇచ్చారు.
ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడిలేదని సదానందగౌడ చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని, పార్టీ నాకు 30 ఏళ్లుగా అన్నీ ఇచ్చిందని, బీఎస్ యడ్యూరప్ప తర్వాత పార్టీలో తరువాత స్థానంతో పాటు అన్ని పదవులు అనుభవించానని మాజీ సీఎం సదానందగౌడ అన్నారు.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications