Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీకి జలక్, ఒక్క అడుగు ముందుకు వేసిన మాజీ ప్రధాని, లీడర్ పేరు ఇదే, ముందు తెలిసిందా ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి చేతులారా అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పగించిన బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో కనీసం 24 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ ఇప్పటి నుంచి పావులు కదుపుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యాలని బీజేపీ ఇప్పటికే డిసైడ్ అయ్యింది.

జేడీఎస్ కు ఆరు సీట్లు ఇచ్చి మిగిలిన 22 లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే జేడీఎస్ కు ఏ లోక్ సభ నియోజక వర్గాలు కేటాయిస్తారు అని మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. మండ్య, హాసన్ లోక్ సభ నియోజక వర్గాలు జేడీఎస్ కు కచ్చితంగా ఇస్తారని రెండు పార్టీల నాయకులు బహిరంగంగానే అంటున్నారు. అయితే మండ్య, హాసన్ లోక్ సభ నియోజక వర్గాల సీట్ల పంపిణి విషయంలో బీజేపీ ఇంకా అధికారికంగా మాట్లాడలేదు.

Former PM HD Deve Gowda announced the name of JDS candidate for Hasan Lok Sabha constituency.
ఒక అడుగు ముందుకు వేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హాసన్ లోకసభ నియోజక వర్గం జేడీఎస్ అభ్యర్థి పేరు ప్రకటించడం కలకలం రేపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ హాసన్ లోక్ సభ నియోజక వర్గాన్ని ఆయన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం త్యాగం చేశారు. అయితే జేడీఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల పట్టుపట్టడంతో మాజీ ప్రధాని దేవెగౌడ హాసన్‌ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

హాసన్ లోక్ సభ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్ లోనే వ్యతిరేకత వెల్లువెత్తడంతో మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగాలని స్థానిక జేడీఎస్ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. ఇదే సమయంలో జేడీఎస్ కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ ఆధ్వర్యంలో ఎంపీ, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, హాసన్ జిల్లాలోని నాయకులతో సమావేశమయ్యారు. పంచాయతీ, తాలూకా పంచాయతీ సభ్యుల అభిప్రాయాలు సేకరించారు.

Former PM HD Deve Gowda announced the name of JDS candidate for Hasan Lok Sabha constituency.
స్థానిక నాయకులు అభిప్రాయాల మేరకు హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మరోసారి హాసన్ అభ్యర్థిగా నిలబెడుతున్నామని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ ప్రకటించారు. ఈ విషయమై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ తనకు ఇంకా మరో రెండున్నరేళ్ల రాజ్యసభ పదవీకాలం ఉందని వివరించారు. అందువలన తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడంలేదని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.

తనకు రాజ్యసభ పదవికాలం ఇంకా ఉంది కాబట్టి ప్రజ్వల్ రేవణ్ణను హాసన్ లో పోటీ చేయించాలని నాయకులు అంటున్నారని, హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని, జేడీఎస్ కార్యకర్తలు ప్రజ్వల్ రేవణ్ణకు సహకరించాలని మాజీ ప్రధాని దేవేగౌడ మనవి చేశారు. మా పార్టీ నేతలతో చర్చించాను. అంతకుముందు లక్ష ఓట్ల తేడాతో ప్రజ్వల్ రేవణ్ణ గెలుపొందారు, ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇంకా ఎక్కువ ఓట్లు, కర్ణాటకలో ఎక్కువ సీట్లలో జేడీఎస్ గెలుస్తుందని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+