మోదీతో మాజీ ప్రధాని చర్చలు. సోనియా గాంధీ బ్యాచ్ కు చెక్ పెట్టాలని డిసైడ్ !
న్యూఢిల్లీ/బెంగళూరు: వచ్చే లోక్సభ ఎన్నికలలోపు కర్ణాటకలో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ-జేడీఎస్ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఈ విషయమై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్షాతో సమావేశమై చర్చలు జరుపనున్నారు. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్డీ రేవణ్ణ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
హెచ్డీ కుమారస్వామి, హెచ్డీ రేవణ్ణ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు హాజరవుతున్నందున ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలోగా బీజేపీతో పొత్తు ఖరారు కావచ్చని జేడీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కర్నాటకలోని 28 లోక్సభ నియోజకవర్గాల్లో ఐదు స్థానాలను జేడీఎస్ డిమాండ్ చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

బీజేపీతో పొత్తుపై జేడీఎస్ నేతలు సంకేతాలు ఇచ్చారు. కానీ ఎవరూ బహిరంగంగా ఒప్పుకోలేదు. సీట్ల పంపకాలపై మాట్లాడేందుకు బీజేపీ- జేడీఎస్ నేతలు నిరాకరించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ పొత్తు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్షా నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
జేడీఎస్కు నాలుగు సీట్లు ఇవ్వాలని అమిత్ షా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే జేడీఎస్ నేతలు ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై ప్రకటన చేసిన కుమారస్వామి గణేష చతుర్థి తర్వాత బీజేపీ నేతలతో చర్చలు జరుపుతామని, లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని అన్నారు.
28 సీట్లలో 4 సీట్లు జేడీఎస్కి వదులుకునేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడ్యూరప్ప ఇప్పటికే ధృవీకరించారు. అయితే కుమారస్వామి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం జేడీఎస్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసింది. మండ్య, హాసన్, కోలార్, బెంగళూరు రూరల్, తుమకూరు నియోజకవర్గాలను జేడీఎస్ డిమాండ్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ఐదు స్థానాల్లో కోలార్, తుమకూరులో బీజేపీ విజయం సాధించింది.

మండ్య స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సుమలత విజయం సాధించారు. హాసన్లో జేడీఎస్ బలంగా ఉంది. తర్వాత ఢిల్లీలో పొత్తుపై జేడీఎస్, బీజేపీ నేతలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర నేతలను బీజేపీ హైకమాండ్ సంప్రదించడం లేదని, జేడీఎస్తో పొత్తుపై బీజేపీ హైకమాండ్ ఇప్పటి వరకు రాష్ట్ర నేతలను సంప్రదించలేదని బీఎస్ యడ్యూరప్ప అన్నారు.
జేడీఎస్తో పొత్తుపై ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. 224 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 66 సీట్లు మాత్రమే గెలుచుకుంది. జేడీఎస్ 18 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ కు చెక్ పెట్టడానికి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications