ఇండీ కూటమిలోకి రండి- చంద్రబాబు, నితీష్ కు యశ్వంత్ సిన్హా ఆహ్వానం..!
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాక జాతీయ స్ధాయిలో ఇద్దరు నేతలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నారు. ఇందులో ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు కాగా.. మరొకరు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. దీనికి కారణం లోక్ సభ ఎన్నికల్లో వారి పార్టీలు సాధించిన విజయాలే. ఏపీ, బీహార్ లో వీరిద్దరూ సాధించిన విజయాలు ఇప్పుడు ఎన్డీయే కూటమిలో వీరికి రెండు, మూడు స్ధానాల్లో కూర్చోబెట్టాయి.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ తమకు కావాల్సిన డిమాండ్లు నెరవేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇది గమనించిన విపక్ష ఇండీకూటమి ఇప్పటికే వీరికి ఆహ్వానాలు పంపుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం జరిగిన ఎన్డీయే కూటమి భేటీకి ముందు ఇండీ కూటమికి చెందిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా చంద్రబాబు, నితీశ్ కు తమ కూటమిలోకి రావాలని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన వరుస పోస్టులు పెట్టారు.

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తక్షణమే ఎన్డీయే నుంచి భారత కూటమిలోకి మారాలని, వారి చర్యలను చరిత్ర నిర్ణయిస్తుందంటూ యశ్వంత్ సిన్హా కోరారు. మోడీ భారతదేశ భవిష్యత్తును సిగ్గులేకుండా నాశనం చేస్తున్నారని,(1) రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలను లొంగదీసుకోవడానికి ఈడీ, సీబీఐ, ఐటీలను వాడుతున్నారని, ఎన్నికలను, ఎంపీ, ఎమ్మెల్యేలను కొనేందుకు అక్రమ ఎన్నికల బాండ్లు, క్రోనీ క్యాపిటలిస్టుల ద్వారా డబ్బును వాడుతున్నారని ఆరోపించారు.
Chandrababu Naidu and Nitish Kumar should immediately switch from the NDA to the INDI Alliance to save India's constitution and democracy. History will judge their actions.
— Yashwant Sinha (@YashwantSinha) June 4, 2024
Modi is shamelessly destroying India's future by: (1) using ED, CBI, and Income Tax agencies to coerce…
మీడియా, బ్యూరోక్రసీని, ఈసీని నియంత్రించడం ద్వారా మోడీ మొగలోమానియాను ముందుకు తీసుకెళ్తున్నారని యశ్వంత్ సిన్హా విమర్శించారు. దైవదూతగా చెప్పుకున్న మోడీకి ప్రజలు ఆయన వాస్తవ స్ధానాన్ని చూపించారన్నారు. చరిత్రలో మిగతా నియంతల్లాగే చెత్తబుట్టలో పడేశారన్నారు. నవీన్ బాబు (నవీన్ పట్నాయక్) ఎప్పటి నుంచో బీజేపీకి మద్దతిచ్చినా టైం రాగానే మోడీ అతన్ని మింగేయడానికి వెనుకాడలేదని యశ్వంత్ సిన్హా గుర్తుచేశారు. ఏదో ఒకరోజు మీ గతి కూడా ఇదే కావచ్చని చంద్రబాబు, నితీశ్ లను యశ్వంత్ హెచ్చరించారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications