ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. అంతలోనే ఆ తల్లికి తీరని శోకం..
కొన్నిసంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని ఆనందాన్ని పంచితే.. మరికొన్ని విషాదాన్ని మిగులుస్తాయి. ఇక్కడ జరిగిన అరుదైన సంఘటన విషాదాన్ని మిగిల్చింది. ఒకే కాన్పుల్లో నలుగురు శిశువులకు జన్మినిచ్చింది ఓ గర్బిణీ. అయితే, అంతలోనే ఆ తల్లికి తీరని శోకం మిగిలింది. ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే కన్నుమూసారు. ఈ విషాద సంఘటన జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగింది.
గంటల వ్యవధిలోని మృతిచెందిన శిశువులు..
కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఈమెకు ఆదివారం సాయంత్రం నొప్పులు రావడంతో స్థానిక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు తీసుకువెళ్లారు కుటుంబసబ్యులు. అయితే, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఆమెను వెంటనే కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు ఆసుప్రతి సిబ్బంది సూచించారు.

ఇక సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రిలో కలీదా సాధారణ ప్రసవం ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ముగ్గురు మగ శిశువులు కాగా, ఒక ఒక ఆడ శిశువు జన్మించారు. అయితే, ఆ శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. అయితే అందులో ముగ్గురు పిల్లలు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, మరొక శిశువును శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.
అక్కడికి వెళ్లాక మరో శిశువు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ తల్లికి తీరని శోకం మిగిలింది. ఈ సంఘటనతో కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం కలీదా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, నెలలు నిండకుండా, తక్కువ బరువుతో జన్మించిన పిల్లలను రక్షించేందుకు అవసరమైన సదుపాయాలు కుప్వారా ఉప-జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో లేవని కలీదా కుటుంబసభ్యులు అంటున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications