వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ పొడి బదులు పురుగుల మందు కలిపిన బాలిక: టీ తాగి నలుగురు మృతి

బీహార్ రాష్ట్రం దర్బాంగా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్ళ బాలిక కుటుంబసభ్యుల కోసం టీ తయారుచేస్తూ అందులో అనుకోకుండా పురుగుల మందు కలిపింది. కాగా, ఆ టీ తాగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

|
Google Oneindia TeluguNews

దర్బాంగా: బీహార్ రాష్ట్రం దర్బాంగా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్ళ బాలిక కుటుంబసభ్యుల కోసం టీ తయారుచేస్తూ అందులో అనుకోకుండా పురుగుల మందు కలిపింది. కాగా, ఆ టీ తాగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. డీఎస్పీ దిల్నావాజ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. అర్చన అనే పదేళ్ల బాలిక కుటుంబసభ్యుల కోసం టీ తయారు చేస్తూ టీ పొడికి బదులుగా పొరపాటు పురుగుల మందు కలిపేసింది. దీన్ని కుటుంబసభ్యులు తాగేశారు.

Four die after consuming tea laced with poisonous pesticides in Bihar

కాసేపటికే టీ తాగిన దుఖాన్ మహతో(60), రామ్ స్వరూప్ మహతో(65), అర్చన(10) అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ప్రకాశ్ మహతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమీలా దేవీ అనే మహిళ పరిస్థితి విహంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

English summary
Four members of a family, including a 10-year-old girl, died this morning after drinking tea inadvertently mixed with poisonous pesticides in Bihar’s Darbhanga district, police said. Deputy Superintendent of Police Dilnawaz Ahmed said the incident happened in a village falling under Bahadurpur police station area of the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X