నాగపూర్ కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు రోగుల మృతి
నాగపూర్-అమరావతి రహదారిలోని వాడీ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రి 'వెల్-ట్రీట్’ మంటలు చెలరేగడంతో నలుగురు చనిపోయారు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది.
వెల్-ట్రీట్ ఒక మినీ కోవిడ్ ఆస్పత్రి. అధికారిక సమాచారం ప్రకారం మంటలు ఆస్పత్రిలోని ఐసీయూలో వ్యాపించాయి.
ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ చనిపోయారని నాగపూర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ కుమార్ ధ్రువీకరించారు.
అగ్ని ప్రమాదం జరిగిందని తమకు శుక్రవారం సాయంత్రం 8.10కి సమాచారం అందినట్లు నాగపూర్ ఫైర్ బ్రిగేడ్ చీఫ్ రాజేంద్ర ఉచ్కే చెప్పారు.
- రఫేల్ విమానాలు: అవినీతి ఆరోపణలు మళ్లీ ఎందుకు వినిపిస్తున్నాయి... తెర వెనుక ఏం జరిగింది?
- కోవిడ్-19: ప్రపంచం మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తయ్యేదెప్పుడు.. పేద దేశాలు ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి
ఈ ఆస్పత్రిలో మంటలు అంటుకున్న సమయంలో అక్కడ 32 మంది రోగులు ఉన్నారు.
అగ్నిమాపక సిబ్బంది మూడో అంతస్తు నుంచి 21 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు.
కాలిన గాయాలతో ఉన్న రోగులను నాగపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్లో చేర్పించారు.
https://twitter.com/NitinRaut_INC/status/1380592382962364418
ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను నగరంలోని మిగతా ఆస్పత్రుల్లో చేర్పించామని మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ చెప్పారు.
ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ హఠాత్తుగా పేలిందని, ఆ సమయంలో అక్కడ ఐదుగురు రోగులు ఉన్నారని వెల్-స్ట్రీట్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రాహుల్ ఠవ్రే సమాచారం ఇచ్చారు.
మరోవైపు, మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో భద్రతా చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/narendramodi/status/1380584498757177347
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన గురించి ట్వీట్ చేశారు.
మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల్లో ముగ్గురిని గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై మావోయిస్టుల లేఖ... అందులో ఏముందంటే..
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- 'ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: జవాన్లపై దాడిని హైదరాబాద్ పోలీసులు ముందే ఊహించారా
- 'ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు... నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను’
- 'అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. దాడిలో గాయపడిన CRPF జవాన్ చెప్పిన వివరాలు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)