Fraud: పోలీసులకు మామూళ్లు, ఫోర్జరీ, పేరుకు వెరిఫికేషన్, భారత ఆర్మీలో ?, ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటకలో !
బెంగళూరు/ విజయనగర్: నకిలీ పత్రాలు తయారు చేసి చిన్నచిన్న ఉద్యోగాలు సంపాధించడం సర్వసాధారం అయిపోయిందని చాలాసార్లు వెలుగు చూసింది. అయితే ముగ్గురు పోలీసులకు మామూళ్లు ఇచ్చిన కేటుగాళ్లు నకిలీ పత్రాలు తయారు చేసి ఏకంగా భారతసైన్యంలో ఉద్యోగాల్లో చేరిపోయారు. అయితే ఓ ఉద్యోగి విషయంలో అతని పై అధికారుల పరిశీలనలో నకిలీ పత్రాలు అని అనుమానం రావడంతో సంబంధిత పోలీసులకు వెరిఫికేషన్ కు పంపించారు. కేటుగాడి పత్రాలను పరిశీలిస్తున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు నిరుద్యోగులు నకిలీ పత్రాలతో భారత సైన్యంలో చేరడానికి ముగ్గురు పోలీసులు సహకరించారని వెలుగు చూసింది. ముగ్గురు పోలీసులతో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి అసలు బండారం మొత్తం బయటకు లాగుతున్నారు. ఈ కేసులో తప్పించుకుని పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఏం జరిగిందంటే ?
మహారాష్ట్రకు చెందిన అజిత్ కుండా కలోని అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి భారత సైన్యంలో చేరడానికి ప్రయత్నించాడు. అజిత్ పత్రాలు పరిశీలించిన పై అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఈ పత్రాలను రీ వెరిఫికేషన్ చెయ్యాలని కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హోస్ పేట్ సమీపంలోని హీరేహడగలి పోలీసులకు సూచించారు.

అన్నీ నకిలీ పత్రాలే
ఆధార్ కార్డు, ఆధాయ దృవీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రం, నివాస దృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన అన్ని నకిలీ పత్రాలను సృష్టించారు. తరువాత పోలీసు వెరిఫికేషన్ కు పంపించారు. పోలీసులనే మేనేజ్ చేసిన కిలాడీలు ఆరు మంది భారత సైన్యంలో ఉద్యోగాలు సంపాధించారు.

తీగలాగితే పోలీసుల డొంక కదిలింది
మహారాష్ట్రకు చెందిన అజిత్ కూడా విజయనగర జిల్లాలోని హోస్ పేట్ లోనే నకిలీ పత్రాలు సృష్టించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అజిత్ తో పాటు ఇంకా ఎంతమంది ఇలా నకిలీ పత్రాలు సృష్టించారని పోలీసులు కూపీలాగారు. ఇదే సమయంలో భారత సైన్యంలో ఇప్పటికే చేరిన వారి పత్రాలను వెరిఫికేషన్ చేసిన ముగ్గురు పోలీసుల వివరాలు సేకరించారు.

ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, మహారాష్ట్ర
పోలీసులను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. నకిలీ పత్రాలను కళ్లు మూసుకుని వెరిఫికేషన్ చేసిన పోలీసులు వారికి క్లీన్ చిట్ ఇచ్చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, మహారాష్ట్రకు చెందిన 10 మందిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
Recommended Video

10 మంది అందర్
అరుణ బసవరాజ్, అజిత్ కూండ కలోని, చౌహాన్ రోహిత్, పరాస్ అస్లాం, గణేష్ మహదేవ, అకాష్ కండోలి అనే నిందితులు నకిలీ పత్రాలు తయారు చేసి భారత సైన్యంలో చేరారని పోలీసు అధికారులు గుర్తించారు. ఈ ఆరు మందితో పాటు ముగ్గురు పోలీసులు, మరో వ్యక్తిని విజయనగర జిల్లాలోని హీరేహడగలి పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులలో కొందరు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications