Free Electricity: గృహాలకు ఉచిత విద్యుత్.. జులై 1 నుంచి అమలు..
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోక్కటిగా హామీలు అమలు చేస్తోంది. తాజాగా ఉచిత కరెంట్ పై ఆ రాష్ట్ర నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్య నేతృత్వంలో కొత్తగా నియమితులైన కర్ణాటక ప్రభుత్వం గృహ జ్యోతి పథకం అమలు కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. దీని కింద ప్రతి నెలా 200 యూనిట్ల కంటే తక్కువ ఉచిత విద్యుత్తు అందించనున్నారు. జూలై 1 నుంచి ఇది అమలులోకి రానుంది.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపాదించిన ఐదు ఎన్నికల హామీలలో గృహ జ్యోతి పథకం ఒకటి. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కర్ణాటక ఇంధన శాఖ ఇటీవలి మార్గదర్శకాలను జారీ చేసింది. దీని కింద ఉచిత విద్యుత్ సరఫరా గృహ సగటు వినియోగంపై ఆధారపడి ఉంటుందని, 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా ఇస్తామని తెలిపింది.

అదే విధంగా, వినియోగదారుడు సగటున నెలకు 150 యూనిట్ల విద్యుత్ను ఉపయోగిస్తే, అతను 165 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను పొందవచ్చు. నెలవారీ సగటు ప్రకారం 200 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లు కొత్తగా ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం కిందకు రావు. వారు పూర్తి బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఒక ఇంటికి రెండు లేదా మూడు మీటర్లు (ఆర్ఆర్ నంబర్) ఉంటే ఒక్కటి మాత్రమే పథకానికి పరిగణనలోకి తీసుకుంటారు.
'గృహ జ్యోతి'తో పాటు మహిళలకు 'శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జూన్ 11 నుంచి అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.లబ్దిదారుల కోసం రవాణా శాఖ 'శక్తి స్మార్ట్ కార్డు'లను జారీ చేస్తుంది. మహిళా ప్రయాణికులు వచ్చే మూడు నెలల్లో ఈ కార్డులను జారీ చేసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. రాజహంస, నాన్-ఏసీ స్లీపర్స్, ఐరావత్, అంబారీతో సహా లగ్జరీ బస్సులను ఈ పథకం నుంచి మినహాయించారు.అలాగే, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications