G-20: ఆఫ్రికన్ యూనియన్కు జీ20లో శాశ్వత సభ్యత్వం, మోడీని హత్తుకున్న అధ్యక్షుడు అసోమాని
న్యూఢిల్లీ: భారత్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ అధ్యక్షతన జీ20 విస్తరణ జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రతిపాదనకు సభ్యులందరి ఆమోదం లభించింది. దీంతో జీ20లో ఆఫ్రికన్ యూనియన్ సభ్యునిగా చేరింది.
జీ20 సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రియన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రకటించారు. దీంతో సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంతరం ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.
ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని యూనియన్ ఆఫ్ కొమొరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ (AU) చైర్పర్సన్ అజలీ అసోమాని ఆనందంతో వచ్చి కౌగిలించుకున్నారు. ఈ పరిణామంతో సమావేశంలో హర్షధ్వానాలు మారుమోగాయి.

అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. మొదటగా మొరాకో భూకంప మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలవాలన్నారు. వారికి అవసరమైన సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.
#WATCH | G 20 in India | PM Modi at the G 20 Summit says "Today, as the president of G 20, India calls upon the world together to transform the global trust deficit into one of trust and reliance. This is the time for all of us to move together. In this time, the mantra of 'Sabka… pic.twitter.com/vMWd9ph5nY
— ANI (@ANI) September 9, 2023
జీ20 అధ్యక్ష హోదాలో భారత్ సభ్యులందరికీ స్వాగతం పలుకుతోందన్నారు ప్రధాని మోడీ. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయమని అన్నారు. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయన్నారు. అందుకే మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ సూచించారు.
G20 Summit in New Delhi admits African Union as permanent member
— ANI Digital (@ani_digital) September 9, 2023
Read @ANI Story | https://t.co/WDp55u7O54#G20India2023 #G20SummitDelhi #PMModi #AfricanUnion pic.twitter.com/r3S8L89nkF
కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు ప్రధాని మోడీ. కోవిడ్ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించాలన్నారు. మనం అందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుతామని చెప్పారు. ఈ క్రమంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య బేధాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారిందని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలోని 70కిపైగా నగరాల్లో 200కుపైగా జీ20 సదస్సులు జరిగాయని తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications