పుణ్యక్షేత్రంలో కామాంధులు.. అరుణాచల గిరిప్రదక్షిణలో ఇద్దరిపై గ్యాంగ్ రేప్ !!

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం)లో వరుసగా వెలుగులోకి వచ్చిన రెండు సామూహిక అత్యాచార ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పవిత్రంగా భావించే గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఈ దారుణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా, వారి నగ్న వీడియోలు చిత్రీకరించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసిన ఘటనలు భక్తుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

ఈ రెండు కేసుల్లో మొత్తం 11 మంది నిందితులను పోలీసులు గుర్తించగా, ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ వ్యవహారం తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

tiruvannamalai-became-in-talks-for-two-separate-sexual-assault-cases-during-pradakshina-that-police

గిరి ప్రదక్షిణకు వచ్చిన వివాహితపై దారుణం..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ధర్మపురి జిల్లాకు చెందిన ఓ వివాహిత గత నెల 30న తన స్నేహితులతో కలిసి పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణకు వచ్చింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం ఆమె ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణం అవుతోంది. ఈ క్రమంలో పెద్దకోలాపాడి ప్రాంతం వద్ద ఆమె, తనతో వచ్చిన ఓ స్నేహితుడు మాట్లాడుకుంటూ ఉండగా, ఆయుధాలతో వచ్చిన కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. కత్తులు, ఇనుపరాడ్లతో బెదిరించి సమీప అటవీ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఇద్దరి దుస్తులు తొలగించి నగ్నంగా వీడియోలు చిత్రీకరించారు. అనంతరం వారిని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

వీడియోలతో బ్లాక్‌మెయిల్.. రూ. లక్ష డిమాండ్

ఘటన జరిగిన మరుసటి రోజే నిందితులు బాధితురాలికి వీడియోలను పంపించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. వీడియోలను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయాందోళనకు గురైన బాధితురాలు మొదట రూ.4 వేల రూపాయలు పంపినట్లు సమాచారం. అయితే వేధింపులు కొనసాగడంతో ధర్మపురి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు తిరువణ్ణామలై పడమర పోలీస్ స్టేషన్‌కు బదిలీ కాగా, అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరో రోజు.. మరో మహిళపై అదే తరహా దాడి

మొదటి ఘటన మరువకముందే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువణ్ణామలై మున్సిపాలిటీ పరిధికి చెందిన 23 ఏళ్ల యువతి గత నెల 31వ తేదీ రాత్రి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడింది. దీంతో అడిఅన్నామలై ప్రాంతానికి చెందిన తన స్నేహితుడిని రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరూ సమీపంలోని హోటల్‌లో టిఫిన్ చేసి అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా అదే తరహాలో ఓ ముఠా వారిని అడ్డగించి, బెదిరించి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది.

చిత్రహింసలు.. సామూహిక అత్యాచారం.. దోపిడీ

అటవీ ప్రాంతంలో యువతి, ఆమె స్నేహితుడిని చిత్రహింసలకు గురిచేసిన నిందితులు, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఇద్దరినీ నగ్నంగా వీడియోలు చిత్రీకరించారు. అంతేకాకుండా యువతి చెవులకు ఉన్న సుమారు రెండు గ్రాముల బంగారు కమ్మలను కూడా లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు తిరువణ్ణామలై పడమర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండో కేసు నమోదు అయింది.

ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

రెండు ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో తమిళనాడు పోలీస్ శాఖ అత్యంత సీరియస్‌గా తీసుకుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా, స్థానిక సమాచారం ఆధారంగా పోలీసులు వేగంగా విచారణ చేపట్టారు. దర్యాప్తులో రెండు ఘటనలకు సంబంధించిన 11 మంది నిందితులను గుర్తించారు.

8 మంది అరెస్ట్.. మిగిలిన వారి కోసం గాలింపు

మంగళవారం రాత్రి పోలీసులు సమన్వయ ఆపరేషన్ నిర్వహించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఆడయూర్‌కు చెందిన వాసుదేవన్, పెద్దబాలియపట్టు ప్రాంతానికి చెందిన ఆకాష్, అశ్వనాథశురన్, అప్పు తదితరులతో పాటు 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారిని రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

భక్తుల భద్రతపై ప్రశ్నలు

అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో వరుసగా మహిళలపై దారుణాలు జరగడం భక్తుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. గిరి ప్రదక్షిణ మార్గంలో మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: పోలీసులు

ఈ కేసులను అత్యంత ప్రాధాన్యంగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని అధికారులు వెల్లడించారు. మహిళల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+