సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: కాల్పులు జరిపిన ఖైదీలు
చండీఘడ్: పంజాబ్ లోని జైలులో గ్యాంగ్ వార్ జరిగింది. ఈ దాడిలో కరుడుకట్టిన నేరస్తుడితో సహా ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైల్ లో కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సాటి ఖైదీలు హడలి పోతున్నారు.
గురువారం ఉదయం భటిండా సెంట్రల్ జైలులో అల్పాహారం తినడానికి ఖైదీలను వదిలి పెట్టారు. ఆ సమయంలో ఖైదీల మద్య గ్యాంగ్ వార్ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. అదే సమయంలో జైలు ఆవరణంలో కాల్పులు జరిగాయి.

ఈ కాల్పులలో కరుడుగట్టిన నేరస్తుడు గుర్జిత్ సింగ్ కు తీవ్రగాయాలైనాయి. జైలు ఆవరణంలోని ఆసుపత్రిలో అతనికి ప్రథమ చికిత్స అందించి తరువాత వేరే ఆసుపత్రికి తరలించారు. ఇతనితో పాటు మరో ఖైదీకి తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న జైలు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్రమ ఆయుధాల కేసులో అరెస్టు అయిన కుల్బీర్ సింగ్ నౌరానా భటిండా సెంట్రల్ జైలులో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నాడు. నౌరానా నే గురువారం ఉదయం కాల్పులు జరిపి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కుల్బీర్ సింగ్ జైలు లోపల వివిద భంగిమలలో నిలబడి సెల్ పోన్ తో ఫోటోలు తీసుకుని ఫేస్ బుక్ లో పెట్టాడు. ఆ ఫోటోలు చూసిన పోలీసులు హడలిపోయారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications