రైళ్ళలో చెత్త ట్రాక్ లపై పడేయకుండా మార్గదర్శకాలు.. అలా చేస్తే వారికి షాక్!
రైలు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న భారతీయ రైల్వే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో చెత్త తొలగింపుపై నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే రైళ్ళలో హౌస్ కీపింగ్ మరియు ప్యాంట్రీ కార్ సిబ్బందికి కీలక సూచనలు చేసింది.
వారికి చెత్త సేకరణ, డిస్పోజల్ పై శిక్షణ
రైలు ప్రయాణ సమయంలో రైళ్లను శుభ్రంగా ఉంచటం కోసం హౌస్ కీపింగ్ మరియు ప్యాంట్రీ కార్ సిబ్బంది నిర్దేశించిన విధానంలోనే చెత్తను సేకరించాలని పేర్కొంది. నిర్దేశించిన స్టేషన్లోనే సురక్షితంగా దానిని పారవేయాలి అని ఆదేశించింది. రైల్వే ట్రాక్ల పైన చెత్త పడేయకూడదని స్పష్టం చేసింది. ఆన్ బోర్డు హౌస్ కీపింగ్ సిబ్బందికి చెత్త సేకరణ మరియు, చెత్త డిస్పోజల్ పైన శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

రైళ్ళలో పరిశుభ్రతకు మార్గదర్శకాలు
పరిశుభ్రతపైన అవగాహన కల్పించడం కోసం సంవాద్ పేరుతో చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఇండియన్ రైల్వే పేర్కొంది. రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలను పెంచడానికి, రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు భారతీయ రైల్వే పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ బృందాలు ప్యాంట్రీ కార్ సిబ్బంది చెత్త విషయంలో ఇలా చెయ్యాలి.
నిర్దేశించిన స్టేషన్లలో సీల్ చేసిన సంచులలో చెత్త జమ చెయ్యాలి
ప్రయాణికులకు టాయిలెట్ల వద్ద ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ ల నుండి వ్యర్ధాలను సేకరించి ఆ రైలు ప్రయాణించే మార్గంలో పేర్కొన్న స్టేషన్లలో సీల్ చేసిన సంచులలో జమ చేయాలి. రైళ్ల లోపల పరిశుభ్రతను కాపాడుకోవడంతో పాటు, ట్రాక్ల పైన కూడా చెత్త పడేయకుండా చూడడంలో భాగంగా, స్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో భాగంగా ఈ విధానం అవసరమని రైల్వే బోర్డు పేర్కొంది.
వ్యర్ధాల నిర్వహణ సరిగ్గా చెయ్యకుంటే కాంట్రాక్ట్ ఉల్లంఘనగా పరిగణన
స్వచ్ఛభారత్ మిషన్ కింద ఈ వ్యర్ధాల నిర్వహణ పైన ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తారు. చెత్త నిర్వహణ పద్ధతులపైన, వీడియోలు ద్వారా వీరికి బోధన చేస్తారు. ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ బృందాలకు, ప్యాంట్రీ కార్ సిబ్బందికి ఈ మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి. ఒప్పందంతో పనిచేసే వీరంతా ఈ మార్గదర్శకాలను పాటించకపోతే, ఏదైనా ఉల్లంఘన జరిగినట్టుగా రైల్వే భావిస్తే అది వారికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
కాంట్రాక్ట్ రద్దయ్యే ఛాన్స్
కఠిన చర్యలలో భాగంగా వారి కాంట్రాక్ట్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా రైల్వే తీసుకునే నిర్ణయం రైల్వే స్టేషన్లను, రైల్వే ట్రాక్లను, రైళ్ళను కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే రైల్వే ఇచ్చిన తాజా మార్గదర్శకాలతో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ బృందాలు, ప్యాంట్రీ కార్ సిబ్బందిపై భారం పెరుగుతుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications