అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!
అయోధ్యలోని రామ మందిరాన్ని అదానీ గ్రూప్ ఛైర్మన్ Gautam Adani సందర్శించారు. తన సతీమణి Priti Adani, కుమారుడు కరణ్, కోడలు పరిధితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా Hanuman Jayanti రోజున ఈ పర్యటన జరగడం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచింది. కాగా పర్యటన ద్వారా తన ఆధ్యాత్మిక విశ్వాసం, సేవాభావం, భారతీయ సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని మరొకసారి చాటుకున్నారు. ఈ పర్యటన కేవలం దర్శనానికి మాత్రమే పరిమితం కాకుండా.. విద్య, సాంకేతికత, సంప్రదాయం మధ్య అనుసంధానాన్ని బలపరిచే దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఈ సందర్భంగా అదానీ మాట్లాడుతూ.. ఈ సందర్శన తనకు "అత్యంత భావోద్వేగంతో కూడిన గర్వ క్షణం" అని తెలిపారు. శ్రీరామ మందిరం కేవలం ఆరాధన స్థలం మాత్రమే కాకుండా.. భారతీయ నాగరికత, ఐక్యత, జాతీయ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముని ఆదర్శాలైన సత్యం, ధర్మం, దయ, సేవ వంటి విలువలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమని అన్నారు.

ఆలయ దర్శనం అనంతరం అదానీ, సమీపంలోని Shri Nishulk Gurukul Mahavidyalayaను సందర్శించారు. 1935లో Swami Tyaganand స్థాపించిన ఈ గురుకులం, ఆర్యసమాజ్ సిద్ధాంతాల ఆధారంగా విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందిస్తోంది. ఇక్కడ గురు-శిష్య సంబంధం, విలువలపై ఆధారిత అభ్యాసం, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో అదానీ నేరుగా సంభాషించి, వారి అభ్యాస విధానాలను దగ్గరగా పరిశీలించారు.
AI ల్యాబ్ ఏర్పాటుకు సాయం..
సంప్రదాయ విద్యను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరాన్ని అదానీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో, Adani Foundation ఆధ్వర్యంలో గురుకులంలో AI-ఆధారిత ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి సహాయమందిస్తామని ప్రకటించారు. ఈ ప్రయోగశాల ద్వారా విద్యార్థులు సాంప్రదాయ శాస్త్ర జ్ఞానంతో పాటు ఆధునిక టెక్నాలజీపై కూడా అవగాహన పొందగలుగుతారన్నారు. ఈ తరహా విధానం భవిష్యత్తులో వారు సవాళ్లను ఎదుర్కొనేలా తయారు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ గురుకులంలో సుమారు 200 మంది విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య అందిస్తున్నారు.
మరోవైపు ఈ సంస్థను గతంలో Mahatma Gandhi, Subhas Chandra Bose వంటి మహానుభావులు సందర్శించారు. విద్యార్థులు సంస్కృత శ్లోకాలను పఠించడం ద్వారా గురుకులంలో ఉన్న క్రమశిక్షణ, సంప్రదాయానికి ఉన్న ప్రాధాన్యం స్పష్టంగా కనిపించింది. ఈ పర్యటన సందర్భంగా అదానీ తన మార్గదర్శక తత్త్వం "సేవా హి సాధనా హై"ని మరోసారి పునరుద్ఘాటించారు. సేవ అనేది ఒకసారి చేసే కార్యం కాకుండా, సమాజానికి నిరంతరంగా చేయాల్సిన బాధ్యత అని ఆయన వివరించారు. అదానీ ఫౌండేషన్ ఇప్పటికే విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
భారత జ్ఞాన వ్యవస్థల పరిరక్షణ...
భారతీయ జ్ఞాన వ్యవస్థలను పరిరక్షించడం ఎంత ముఖ్యమో అదానీ పేర్కొన్నారు. అదే సమయంలో, సాంకేతిక ప్రపంచంలో వస్తున్న అవకాశాలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయం మరియు ఆధునికత కలిసే దిశలో ఈ చర్యలు దేశానికి బలమైన పునాది వేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే Maha Kumbh Mela (ప్రయాగ్రాజ్), Rath Yatra (పూరీ) వంటి ప్రధాన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం విశేషం.
-
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications