వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వీడియోపై పోలీసులు సీరియస్: ట్విట్టర్‌పై ఎఫ్ఐఆర్: జర్నలిస్టులపైనా

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దుమారానికి దారి తీసిన ఘజియాబాద్ ఉదంతంపై అక్కడి పోలీసులు యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. దీనితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న కొందరు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలు సహా ట్విట్టర్ యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనకు మతం రంగు పులమడానికి ప్రయత్నించారనే కారణంతో కాంగ్రెస్ నేతలు, జర్నలిస్టులపై కేసు పెట్టారు. దానికి సంబంధించిన వీడియోను వైరల్‌గా మారడాన్ని నిరోధించడంలో విఫలమైనందున ట్విట్టర్‌ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

కేసీఆర్‌కు ఎన్నికల భయం?: వైఎస్ జగన్ స్ట్రాటజీ: బ్యాక్ అప్ రెడీకేసీఆర్‌కు ఎన్నికల భయం?: వైఎస్ జగన్ స్ట్రాటజీ: బ్యాక్ అప్ రెడీ

ఘజియాబాద్‌ సమీపంలోని లోని అనే ప్రాంతంలో 72 సంవత్సరాల వయస్సున్న ఓ ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేయడానికి సంబంధించిన వీడియో అది. ఆ వృద్ధుడిని అబ్దుల్ సమద్‌గా గుర్తించారు. ఆయనపై కొందరు వ్యక్తులు దాడి చేసి, తీవ్రంగా కొట్టడం, గడ్డాన్ని కత్తిరించడం వంటి దారుణ చర్యలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్, కొందరు జర్నలిస్టులు ఆరోపించారు. జైశ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చేయాలంటూ ఆయనను కొట్టారనేది వారి ఆరోపణ. కొందరు జర్నలిస్టులతో కలిసి ఈ ఘటనకు మతం రంగు పులమడానికి ప్రయత్నించారని ఘజియాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

Ghaziabad Police registered FIR against 9, including Twitter and some journalists

Recommended Video

Etela Rajender పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటు విమర్శలు!!

ఈ కారణంతో మహ్మద్ జుబేర్, సబా నక్వీ, రాణా అయ్యూబ్‌, సల్మాన్ నిజామీ, సమా మహ్మద్‌తో పాటు ఓ ఇంగ్లీష్ న్యూస్ పోర్టల్‌పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోను వైరల్‌గా మార్చడాన్ని నిరోధించడంలో ట్విట్టర్ విఫలమైందనే కారణంతో- ఆ సంస్థ పేరును కూడా ఇందులో చేర్చారు. ట్విట్టర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, భారత్‌లోని ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌పై వేర్వేరుగా కేసులు పెట్టారు. నిందితులపై 153, 153-ఎ, 295-ఎ, 505, 120-బీ, 34 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ పరిణామం.. ట్విట్టర్‌పై వేటు వేయడానికి మరింత ఊతమిచ్చినట్టయిందని అంటున్నారు.

English summary
Ghaziabad Police in Uttar Pradesh registered FIR against 9, including Twitter Inc, Congress and some journalists, in connection with the incident in Loni where a man was thrashed and his beard was chopped off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X