Girl: 10వ తరగతి అమ్మాయిని మార్కెట్ లో కిడ్నాప్ చేసి కారులో ఏం చేశారంటే ?, రాజధానిలో !
న్యూఢిల్లీ: స్కూల్ కు వెలుతున్న అమ్మాయి మీద కొందరు కన్ను వేశారు. అమ్మాయిని లొంగదీసుకోవాలని నిందితులు అనేక ప్రయత్నాలు చేశారు. స్కూల్ కు వెలుతున్న అమ్మాయి ఆమె పాటికి ఆమె చదువుకుంటూ ఇతర విషయాలు పట్టించుకోవడం మానేసింది. ఇదే సమయంలో 10వ తరగతి అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణం గురించి ఆ సిటీ డిప్యూటీ పోలీసు కమీషనర్ మనోజ్ సి. మీడియాకు చెప్పారు. ఈనెల 6వ తేదీన దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలోని మార్కెట్ దగ్గర 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని కొందరు కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి పారిపోయారు.
తరువాత కారును ఢిల్లీలోని మహిపాల్ పుర ప్రాంతంలోకి తీసుకెళ్లారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద కారులోనే కామాంధులు సామూహిక అత్యాచారం చేశారని సిటీ డిప్యూటీ పోలీసు కమీషనర్ మనోజ్ సి. మీడియాకు చెప్పారు. 10వ తరగతి అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసిన యువకులు అందరూ 20 ఏళ్ల వయసు ఉన్నవారే అని సిటీ డిప్యూటీ పోలీసు కమీషనర్ మనోజ్ సి. మీడియాకు చెప్పారు.
అయితే బాధితురాలికి, సామూహిక అత్యాచారం చేసిన యువకులకు బయటకు కనపడేలా ఎలాంటి గాయాలు కాలేదని, అందరికి వైద్యపరీక్షలు చేయించి కేసు విచారణ చేస్తున్నామని సిటీ డిప్యూటీ పోలీసు కమీషనర్ మనోజ్ సి. మీడియాకు చెప్పారు. ఇప్పటికే మైనర్ అమ్మాయి సామూహిక అత్యాచారం కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని వసంత్ విహార్ పోలీసు అధికారులు తెలిపారు.