పూజల కోసమని తీసుకెళ్లి.. కదులుతున్న కారులో అత్యాచారం
త్రిపురలో ఒక సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై కదులుతున్న కారులో ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలి బంధువు కూడా ఈ నేరంలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
ఈ దారుణ ఘటన త్రిపురలోని గోమతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు నిందితులుగా గుర్తించిన మిథున్ దేబ్నాథ్(24), బోవర్ దేబ్బర్మ(24) అదే జిల్లాలోని మహారాణి ప్రాంతానికి చెందినవారు. బాధితురాలు వారి బంధువులతో కలిసి గురువారం సాయంత్రం గోమతి జిల్లాలోని ఉదయ్పూర్లో ఉన్న త్రిపుర సుందరి ఆలయానికి వెళ్లింది.

ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత ముగ్గురు కారులో ఉదయ్పూర్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో మిథున్, బోవర్ కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మొదట ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వారిలో ఇద్దరిని మాత్రమే నిందితులుగా పేర్కొంది.
పోలీసుల దర్యాప్తు
బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో మిథున్ దేబ్నాథ్ బాధితురాలి బంధువు. పోలీసులు నిందితులు ప్రయాణించిన కారును ఫోరెన్సిక్ పరీక్ష కోసం స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసును వేగంగా, సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
కోల్కతాలో మోడల్పై అత్యాచారం
ఇలాంటి ఘోరమైన ఘటన ఒకటి గత వారం కోల్కతాలో కూడా జరిగింది. ఒక మోడల్ ఇద్దరు వ్యక్తులపై అత్యాచారం ఆరోపణలు చేసింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తామని చెప్పి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన 2023లో జరిగినప్పటికీ, ఆమె 2025 ఆగస్టు 18న కస్బా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications