వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో బంధించి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాల విద్యార్థినిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేశారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన బుధవారం విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.

బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఓ ఇంట్లో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై దారుణంగా చంపేసి మృతదేహాన్ని కాలువలో పారేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Girl gang-raped, murdered in Ludhiana; kin hold dharna

బాలికపై అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. శరీరంపై 17 గాయాలతో పాటు తల పగిలి ఉంది. పదునైన ఆయుధంతో తలపై దాడిచేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. జరిగిన దారుణ సంఘటనపై బాలిక కుటుంబ సభ్యులతో పాటు బంధువులు ఆందోళన చేపట్టారు.

తెలిసినవారే ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇద్దరు లేదా అంతకు ఎక్కువ మంది ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు భావిస్తున్నారు. బాధితురాలిని కారులో తీసుకుని వెళ్లి ఓ ఇంట్లో బందించి ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. బాధితారులి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.

English summary
An 18-year-old girl of New Janta Nagar in Shimlapuri was reportedly kidnapped, gang-raped and murdered by unidentified assailants. The bare body of the victim was recovered from Sidhwan Canal, near Barewal, her bag containing her school uniform from Jadwaddi. The incident triggered a protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X