College girl: ఫోన్ కు అంకితం అయిన కాలేజ్ అమ్మాయి, సీక్రేట్ పాస్ వర్డ్ పెట్టిన తమ్ముడు !
బెంగళూరు/దోడ్డబళ్లాపురం: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి, ఆమె తమ్ముడి కోసం తల్లిదండ్రులు స్మార్ట్ మొబైల్ ఫోన్ తీసిచ్చారు. కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న యువతి ఎక్కువగా మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, సోషల్ మీడియాలో కాలం గడపడం చేస్తోంది. మొబైల్ ఫోన్ కోసం అక్కాతమ్ముడు రోజూ గొడవపడుతున్నారు. తల్లిదండ్రులు బుద్దిమాటలు చెప్పినా వారు మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు. అక్క చదువుకోకుండా మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతోందని తమ్ముడు ఫోన్ కు సీక్రేట్ పాస్ట్ వర్డ్ పెట్టాడు. ఇదే విషయంలో గొడవ జరిగింది. ఇంటిలోని బెడ్ రూమ్ లోకి వెళ్లిన కాలేజ్ అమ్మాయి లోపల లాక్ చేసుకుంది.
Wife; భార్యను చంపేసి అంబులెన్స్ కు ఫోన్ చేసిన భర్త, ఇంటికే ప్రియుడిని పిలిపిస్తోందని తెలిసి ?
కాలేజ్ అమ్మాయి
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దోడ్డబళ్లాపురం (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లోని గణిగార పేట్ లో రుచిత (19) అనే యువతి నివాసం ఉంటున్నది. దోడ్డబళ్లాపురంలోని ప్రైవేట్ కాలేజ్ లో రుచిత ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. రుచిత ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. రుచితను బాగా చదివించాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.
మొబైల్ ఫోన్ కు అంకితం అయిన కాలేజ్ అమ్మాయి
రుచిత ఆమె తమ్ముడి కోసం తల్లిదండ్రులు స్మార్ట్ మొబైల్ ఫోన్ తీసిచ్చారు. కాలేజ్ నుంచి ఇంటికి వెలుతున్న రుచిత ఎక్కువగా మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, సోషల్ మీడియాలో కాలం గడపడం చేస్తోంది. మొబైల్ ఫోన్ కోసం రుచిత ఆమె తమ్ముడు రోజూ గొడవపడుతున్నారు. తల్లిదండ్రులు బుద్దిమాటలు చెప్పినా వారు మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు.
కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య
అక్క రుచిత చదువుకోకుండా మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతోందని తమ్ముడు ఆ మొబైల్ ఫోన్ కు సీక్రేట్ పాస్ట్ వర్డ్ పెట్టాడు. ఇదే విషయంలో రుచితకు, ఆమె తమ్ముడికి గొడవ జరిగింది. ఇంటిలోని బెడ్ రూమ్ లోకి వెళ్లిన కాలేజ్ అమ్మాయి రుచిత లోపల లాక్ చేసుకుని ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే రుచితను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రుచిత ప్రాణం పోయింది. మొబైల్ ఫోన్ కోసం రుచిత ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు.