Girlfriend: ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన శాడిస్టుకి బెయిల్ కావాలంటా, వీడికి ఒక లాయర్!
న్యూఢిల్లీ: ప్రేమించిన అమ్మాయి శ్రదాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు కుటుంబ సభ్యులను దూరం చేసి వెంట పిలుచుకుని ఢిల్లీ వెళ్లిన ఆమె ప్రియుడు హఫ్తాబ్ అమీన్ పూనావాలా అలియస్ హఫ్తాబ్ ఆమెతో సహజీవనం చేశాడు. ప్రేమించిన అమ్మాయి శ్రద్దాను దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా నరికేసిన కిరాతకుడు హఫ్తాబ్ పోలీసులకు చిక్కిపోయాడు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని కిరాతకుడు కోర్టును ఆశ్రయించాడు.
Wife: భర్త ఫ్రెండ్ ను గిల్లిన వల్లి, మొగుడు ముందే క్రిమినల్, సైలెంట్ గా ఉంటే కిక్కు లేదని?
శ్రద్దాను కిరాతకంగా హత్య చేి ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికేసిన హఫ్తాబ్ కు ఇప్పటికే నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. అటవి ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న శరీరంలోని ముక్కలు శ్రద్దావే అని సంబంధిత అధికారులు తేల్చి చెప్పారు. శ్రద్దా తనను వదిలేస్తానని పదేపదే బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని హఫ్తాబ్ ఇప్పటికే పోలీసులకు చెప్పాడు.
దేశం మొత్తం హడలిపోయిన శ్రద్దా హత్య కేసు నిందితుడు హఫ్తాబ్ ప్రస్తుం తీహార్ జైల్లో ఉన్నాడు. దేశం మొత్తం హడలిపోయే విధంగా ప్రియురాలు శ్రద్దాను దారుణంగా హత్య చేసిన కిరాతకుడు హఫ్తాబ్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఢిల్లీ కోర్టులో అర్జీ సమర్పించడం హాట్ టాపిక్ అయ్యింది.
Wife: బ్లూటీపార్లల్ లో భార్య, డ్రెస్ కోడ్ తో భేజారు. రెండు రాష్ట్రల మ్యద నిలబెట్టి నరికేశాడు!
శుక్రవారం హఫ్తాబ్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అతని తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు. శనివారం ఢిల్లీ కోర్టులో హఫ్తాబ్ బెయిల్ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని అతని న్యాయవాది అన్నారు. లవ్ జీహాద్ లో భాగంగా శ్రద్దాకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో లొంగదీసుకుని ఆమెను దారుణంగా హత్య చేసిన హఫ్తాబ్ ను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.