India News-Jan Ki Baat: గోవాలో హంగ్, సర్వేలో షాకింగ్ ఫలితాలు, కింగ్ మేకర్స్ ఎవరు !
గోవా/పణజి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో ఆ ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి ఎవరు వస్తారా ? అనే ఉత్కంఠ మొదలైయ్యింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటరు మహానుభావులు ఎవరిని కరుణించారు, ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం ఈనెల 10వ తేదీన వెలుగు చూడనుంది. అయితే శనివారం రాత్రి ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. 2017లో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేసి ఐదు సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యింది. అయితే ఇప్పుడు గోవాలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారు, గోవా ఓటర్లు ఎవరిని కరుణించారు అంటూ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. జన్ కీ బాత్- ఇండియా న్యూస్ చానల్ సర్వే ప్రకారం గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెలుగు చూసింది.
Illegal affair: తల్లితో కలిసి మాజీ లవర్ ను లేపేసింది, మిడ్ నైట్ స్కెచ్, మ్యాటర్ భర్తకు తెలిస్తే !
40 మంది ఎమ్మెల్యేల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు
గోవాలో మొత్తం 40 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. గోవాలో 40 మంది శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2017లో గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజక వర్గాల్లో నాయకుల తలరాతలు తారుమారు అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ఎవరి ధీమా వాళ్లదే
అయితే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎంజీపీ, ఎన్ సీపీ, శివసేన పార్టీలు పోటీ చేశాయి. కొన్ని పార్టీలు వివిద పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ జపం చేసిన బీజేపీ నాయకులు గోవాలో సులభంగా తాము గెలిచిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు.
Recommended Video
జన్ కీ బాత్-ఇండియా న్యూస్ చానల్ సర్వేలో షాక్
జన్ కీ బాత్- ఇండియా న్యూస్ చానల్ ప్రకారం గోవాలో బీజేపీకి 13 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 19, అమ్ ఆద్మీ పార్టీకి 3 నుంచి 5 సీట్లు, ఇతరులకు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. అయితే జన్ కీ బాత్- ఇండియా న్యూస్ చానల్ సర్వే ప్రకారం గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెలుగు చూడటంతో ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు.