ఫిబ్రవరి 14న ఆ రాష్ట్రంలో హాలిడే: ప్రభుత్వం ప్రకటన
లక్నో: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్లుండి తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఉత్తర ప్రదేశ్లో మాత్రమే తొలి విడత పోలింగ్ ఉంటుంది. 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
14వ తేదీన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్లో రెండో విడత పోలింగ్ ఉంటుంది. గోవా, ఉత్తరాఖండ్లల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ ముగుస్తుంది. గోవా, ఉత్తరాఖండ్లతో పాటు పంజాబ్లో కూడా అదే రోజు పోలింగ్ను కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ చేసినప్పటికీ.. ఆ తరువాత దాన్ని మార్చింది. ఫిబ్రవరి 14వ తేదీన గురు రవిదాస్ జయంతి కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
గోవా అసెంబ్లీలో ఉన్న మొత్తం స్థానాల సంఖ్య 40. వాటన్నింటికీ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆ రోజున మొత్తం 11,56,762 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సజావుగా సాగడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోవా వ్యాప్తంగా 1,722 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండటానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంది ఈసీ.

పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14వ తేదీన సెలవు రోజుగా ప్రకటించింది గోవా ప్రభుత్వం. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింటికీ సెలవు ఇచ్చింది. వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, షాపులను మూసివేయాలని సూచించింది. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించకూడదని పేర్కొంది. ఈ మేరకు గోవా సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి శ్రీపాద్ అర్లేకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video
2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 19 స్థానాలను గెలుచుకోగలిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అయిదేళ్ల పరిపాలనే గీటురాయిగా ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పుంజుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సారి త్రిముఖ పోటీ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications