గోవా తొలి మహిళా సీఎం కన్నుమూత
పానాజీ : గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న గోవా తొలి మహిళా ముఖ్యమంత్రి శశికళా కాకోద్కర్ (81) ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. పానాజీలోని స్వగృహం అల్తిన్హోలో ఆమె కన్నుమూశారు.
శశికళా కాకోద్కర్ తండ్రి దయానంద్ బండోద్కర్ కూడా 1973లో గోవా ముఖ్యమంత్రిగా చేశారు. సీఎంగా కొనసాగుతుండగానే ఆయన మృతి చెందారు. తండ్రి మరణానంతరం సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు శశికళా. దీంతో గోవాకు తొలి మహిళా సీఎం కాగలిగారు. 1973-79కాలంలో గోవా సీఎంగా పనిచేసిన శశికళా.. 1990లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. శశికళా మరణంపై గోవా ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ తన సంతాపం ప్రకటించారు.













Click it and Unblock the Notifications