"కాళీమాత"కు ఘోర అవమానం.. కలలో చెప్పిందంటూ !!
ముంబైలోని చెంబూర్లో ఉన్న కాళీమాత ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాళీమాత రూపంలో ఉండే విగ్రహం మేరీ మాత అలంకరణలో దర్శనమివ్వడంతో భక్తులు షాక్కు గురయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా.. హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మేరీమాత అలంకరణలో కాళీమాత విగ్రహం..
కాగా హిందూ దేవత విగ్రహం క్రైస్తవ మతంలోని మేరీ మాత మాదిరిగా అలంకరించారు. సాధారణంగా భయరూపిణీగా కనిపించే కాళీమాతను ఈ తరహాగా అలంకరించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. కొన్ని క్షణాల్లోనే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విగ్రహాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన భక్తులు వెంటనే దీంతో ఇదేంటని ఆలయ పూజారి రమేష్ను ప్రశ్నించారు. కానీ పూజారి ఇచ్చిన వివరణ భక్తులను మరింతగా ఆగ్రహపరిచినట్టు తెలుస్తోంది.

కలలో అమ్మవారు చెప్పారంటూ..
తన కలలో అమ్మవారు దర్శనమిచ్చి, మేరీ మాత రూపంలో అలంకరించమని చెప్పారని పూజారి సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం పట్ల స్థానిక భక్తులు, మత పెద్దలు, సాంఘిక కార్యకర్తలకు అసలు నమ్మశక్యం కాకపోవడంతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. స్థానిక భక్తుల్లో పలువురు ఈ ఘటన వెనుక పూజారి ఒక్కడి కాకుండా మరెవరైనా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూజారిని ఎవరో ప్రభావితం చేసి.. డబ్బులు ఇచ్చి ఈ పని చేయించివుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మతాల మధ్య విభేదాలు రేపేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కావచ్చని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై భక్తులు RCF పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేయడంతో పూజారి రమేష్ను అరెస్ట్ చేశారు. మత భావాలను కించపరచినందుకు IPC సెక్షన్ 295A కింద కేసు నమోదు చేశారు.
తరువాత కోర్టులో హాజరుచేయగా పూజారికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించబడింది. ఈ మేరకు CCTV ఫుటేజీలు, పూజారి ఫోన్ కాల్ డేటా, ఆలయంలోకి వచ్చిన వ్యక్తుల వివరాలు అన్నీ పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ గా మారడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
తప్పిదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విగ్రహానికి పునఃప్రతిష్ట చేసి ఆలయ నిర్వహణను పూర్తిగా మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. స్థానికంగా ఉద్రిక్తత పెరగడంతో పోలీసు బందోబస్తు పెంచారు. ఈ ఘటనపై హిందూ మత పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
-
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..!












Click it and Unblock the Notifications