12.30 లక్షలమంది రైల్వే ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం తీపివార్త
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దసరా - దీపావళి బోనస్ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఈ మొత్తాన్ని అందిస్తారు.
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దసరా - దీపావళి బోనస్ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఈ మొత్తాన్ని అందిస్తారు.
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో 12.30 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2016-17కుగాను 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందజేస్తారు. ఒక్కొక్కరికి రూ.7,000 వంతున మంజూరు చేయనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగి అదికంగా రూ.17,951 పొందుతారు. మొత్తం ఉద్యోగులకు రూ.2,245.45 కోట్ల రూపాయలు అవుతుంది.

భారతీయ రైల్వే ప్రజల కోసం పని చేస్తుందని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ బోనస్ మరింత సమర్థవంతంగా పని చేసేందుకు, మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. 2016-17 ఏడాదికిగాను నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక ఆధారిత బోనస్కు మంత్రిమండలి ఓకే చెప్పిందన్నారు.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications