బ్యాంక్ ఉద్యోగులకు గుడ్న్యూస్
బ్యాంక్ ఉద్యోగులకు తీపి కబురు అందింది. బ్యాంక్ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్(DA) పెంచారు. మే, జూన్, జూలై 2024కి 15.97% డీఏ ఉండనుంది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (IBA).. జూన్ 10న విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ మేరకు పేర్కొంది
'క్లాజ్ 13 ప్రకారం ఏడాది మార్చి 8వ తేదీ 12వ ద్వైపాక్షిక సెటిల్మెంట్, ఆనాటి జాయింట్ నోట్లోని క్లాజ్ 2 (i) ప్రకారం.. మే, జూన్ , జూలై నెలలలో వర్క్మెన్, ఆఫీసర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్ రేటు 15.97%. కాగా, మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో పారిశ్రామిక కార్మికులకు (బేస్ 2016= 100) ధృవీకరించిన అఖిల భారత సగటు వినియోగదారు ధర సూచిక క్రింది విధంగా ఉంది..

జనవరి 2024 - 138.9
ఫిబ్రవరి 2024 - 139.2
మార్చి 2024 - 138.9
పైన పేర్కొన్న వాటి సగటు CPI 139, తదనుగుణంగా 123.03 కంటే ఎక్కువ పాయింట్ల సంఖ్య 15.97 (139- 123.03) చివరి సగటు త్రైమాసిక సీపీఐ 138.76. అందువల్ల, మే, జూన్, జూలై 2024కి 0.24 పాయింట్ల పెరుగుదల ఉంది.
ఈ ఏడాది మార్చిలో, ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు వార్షిక వేతన పెంపునకు (17%) అంగీకరించాయి. దీని ఫలితంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంవత్సరానికి రూ. 8,284 కోట్ల అదనపు చెల్లింపులు జరుగుతాయి. నవంబరు 2022 నుంచి అమలులోకి రానున్న వేతనాల పెంపుతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
అధికారుల వేతన సవరణపై 9వ జాయింట్ నోట్ ప్రకారం, "ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థాపన ఖర్చుల వేతన స్లిప్ కాంపోనెంట్ వ్యయంలో 17% మొత్తం వేతన సవరణ పెరుగుదల (పే స్లిప్ కాంపోనెంట్) రూ. 8,284 కోట్ల కంటే ఎక్కువ.
నోటిఫికేషన్ ప్రకారం.. "CAIIB (CAIIB పార్ట్-II) పూర్తి చేసిన అధికారులు నవంబర్ 1, 2022 నుంచి రెండు ఇంక్రిమెంట్లకు అర్హులు. "కొత్త స్కేల్లు రూ. 48480/- నుంచి రూ.173860/- వరకు ఉండనుంది. ఇవి స్కేల్ I నుంచి VII వరకు అన్ని స్కేల్లను కవర్ చేస్తాయి. ఈ పెరుగుదల నవంబర్ 1, 2022 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.
డీఏ కోసం ఇండెక్స్ 1960 = 100 నుంచి 201+6 = 100 సిరీస్కి మార్చారు. దీని ఫలితంగా 2016 = 100 సిరీస్ ప్రకారం మార్పిడి కారకాన్ని 0.06 నుంచి 0.99కి మార్చడం వల్ల బ్యాంక్ ఉద్యోగులకు మెరుగైన డియర్నెస్ అలవెన్స్ తో ప్రయోజనం చేకూరుతుందని ఉమ్మడి నోట్ జోడించింది.
ఐదు రోజుల పనిదినాలు
వారానికి ఐదు రోజుల పని కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ యూనియన్లు ఈ ప్రతిపాదనపై అంగీకరించాయి, ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. మార్చి 2024లో జరిగిన ఉమ్మడి ప్రకటన ప్రకారం, ఉమ్మడి నోట్లో అన్ని శనివారాలను బ్యాంకు సెలవులుగా గుర్తిస్తున్నందున, పీఎస్యూ బ్యాంకు ఉద్యోగులకు వారంలో 5 రోజుల పని కోసం ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దిష్ట కనీస పని గంటలు, బ్యాంకులు పాటించాల్సిన కస్టమర్ సేవా కాలాలను నిర్దేశిస్తుంది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ (పీఎస్యూ) బ్యాంకులు ఐదు రోజుల పనివారాన్ని అమలు చేయవచ్చో లేదో నిర్ణయించడంలో సెంట్రల్ బ్యాంక్ అందించే మార్గదర్శకత్వం కీలకంగా ఉంటుంది. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమలులోకి వస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications