ముండే మృతి:మోడీ దిగ్భ్రాంతి, బాబు, కెసిఆర్ సంతాపం
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే దుర్మరణం గురించి తెలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముండే మృతి విషయం తెలియగానే మోడీ ట్విట్టర్లో స్పందించారు. ముండే నిజమైన ప్రజా నాయకుడు అని, అతని మృతి దేశానికి, ప్రభుత్వానికి తీరని లోటు అన్నారు.
వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ముండే సేవలు మరువలేనివి అన్నారు. అతను ప్రజా నాయకుడు అన్నారు. ముండే కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. తాము వారికి అండగా నిలబడతామని చెప్పారు.

పలువురి సంతాపం
గోపినాథ్ ముండే మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంతాపం తెలిపారు. టిడిపి అధ్యక్షులు, కాబోయే ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ముండే మృతి దేశానికి, బిజెపికి ఎన్డీయేకు తీరని లోటు అన్నారు.
రేపు అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి గోపినాథ్ ముండే అంత్యక్రియలు మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం పరాలీలో రేపు జరుగుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గోపినాథ్ ముండే మృతి బాధాకరమని మరో కేంద్రమంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రధానికి సమాచారం అందించినట్లు చెప్పారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications