గోరక్పూర్ అల్లర్ల కేసు: యోగి పాత్రపై సిబిఐ విచారణ కావాలన్న పిటిషన్ కొట్టివేత
లక్నో: 2007లో జరిగిన గోరక్పూర్ అల్లర్ల కేసులో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అలహాబాద్ హైకోర్టులో గురువారం ఊరట లభించింది.
గోరక్పూర్ అల్లర్ల కేసులో యోగి ఆదిత్యనాథ్ పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని న్యాయస్థానం కొట్టివేసింది.

జస్టిస్ కృష్ణ మురారీ, జస్టిస్ ఎసీ శర్మల డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ కొట్టివేసింది. యోగిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత ఆయనకు ఇది మరో ఊరట.
యోగి ఆదిత్యనాథ్ అల్లర్ల కేసులో నిందతుడిగా ఉన్నారని, ఈ కేసు దర్యాఫ్తు చేస్తున్న సీఐడీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నందున, ఆ కేసును ప్రభావితం చేయవచ్చునని, కాబట్టి దీనిని సీబీఐకి అప్పగించాలని పర్వేజ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2007లో రెండు మతాల మధ్య జరిగిన గొడవలో ఓ హిందూ వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత యోగి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కేసు నమోదయింది. అలహాబాద్ కోర్టు కల్పించుకున్న తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications