పన్నీర్ సెల్వం రాజీనామా, గవర్నర్ ఆమోదం
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామాకి సోమవారం గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఆమోద ముద్ర వేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే వరకు పన్నీర్ సెల్వం సీఎం పదవిలో కొనసాగనున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామాకి సోమవారం గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఆమోద ముద్ర వేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే వరకు పన్నీర్ సెల్వం సీఎం పదవిలో కొనసాగనున్నారు. తమిళనాడు రాజకీయాలు ఆదివారం శరవేగంగా మారిపోయాయి.
అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికయ్యారు. దీంతో ఆమె సీఎం పదవి చేపట్టడం లాంచనంగా మారింది. దీనికి అనుకూలంగా ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుకు పంపించారు.
సోమవారం పన్నీర్ సెల్వం రాజీనామాకు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఆమోద ముద్ర వేశారు. రెండుమూడు రోజుల్లో శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం నెంబర్ టూ గా ఉంటారా ? లేదా ? అనే విషయం అన్నాడీఎంకే వర్గాలు మాత్రం కచ్చితంగా చెప్పడం లేదు. పన్నీర్ సెల్వంకు అసలు ఆర్థిక శాఖ కేటాయిస్తారా ? అనే విషయంపై అనుమానాలు ఉన్నాయని ఆయన వర్గీయులు అంటున్నారు.