సివిల్ పరీక్ష వయో పరిమితి తగ్గింపు: పరిశీలిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ పరీక్షలలో వయస్సు కుదించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు బస్వన్ కమిటీ సూచనలు చేసింది. ఆ కమిటీ ఎనిమిది నెలల క్రితం కేంద్రానికి నివేదిక ఇచ్చింది.
ప్రస్తుతం 32 ఏళ్లుగా ఉన్న అర్హత వయో పరిమితిని కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు బస్వన్ కమిటీ సూచనలు పరిశీలిస్తోంది.

సివిల్స్ పరీక్షకు సంబంధించి సూచనలు చేస్తూ బస్వన్ కమిటీ నివేదికతో పాటు, యూపీఎస్సీ సిఫార్సులు 2017 మార్చి 20న అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని పర్సనల్ అండ్ ట్రెయినింగ్ డిపార్ట్మెంట్ ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది.












Click it and Unblock the Notifications