వాహనదారులకు శుభవార్త: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ గడువు పెంపు -పొల్యూషన్ సర్టిఫికెట్పైనా కేంద్రం కీలక నిర్ణయం
కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని వాహనదారులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర ప్రభుత్వం వెలువరించింది. అన్ని రకాల వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లింపు గడువును మరో మూడు నెలలు పొడిగించింది. అదే సమయంలో పొల్యూషన్ సర్టిఫికేట్ల జారీపైనా అనూహ్య నిర్ణయం తీసుకుంది.
డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) వంటి వాహన సంబంధిత డాక్యుమెంట్ల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

నిజానికి గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది. వాహనానికి చెందిన ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. మరోవైపు,
పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీ- పొల్యూషన్ అండర్ కంట్రోల్) జారీ విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఏకరీతిన పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే, పీయూసీ డేటాను జాతీయ రిజిస్టర్తో అనుసంధానం చేస్తూ నోటిఫికేషన్ వెలువరించింది. ఇకపై అందజేసే పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనం నంబర్, యజమాని పేరు, అతడి ఫోన్ నంబర్, ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్, ఉద్గార స్థితి తదితర వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ముద్రించనున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్కు మొబైల్ నంబర్ను తప్పనిసరి చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువ ఉద్గారాలు విడుదలవుతున్నట్లేతే రిజక్షన్ స్లిప్ను కూడా అందించనున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications