ఎయిరిండియా ప్రైవేటు పరం... జూన్లోగా 51 శాతం వేలం: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా
న్యూఢిల్లీ: పీకల్లోతు నష్టాలలో కూరుకుపోయిన ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. ఎయిరిండియాను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధమవుతోంది.
ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ, నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియాకు తిరిగి మహర్దశ తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఎయిరిండియాను ప్రైవేటుపరం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలిపారు.

ఎయిరిండియాలో 51 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుని, జూన్ నాటికి బిడ్డింగ్ నిర్వహించి, డిసెంబర్ నాటికల్లా చట్టబద్ధమైన ముగింపు పలకాలని నిర్ణయించామని మంత్రి జయంత్ సిన్హా తెలిపారు.
ఎయిర్ ఇండియాను నష్టాల బారినుంచి గట్టెక్కించేందుకు 2012లో తీసుకొచ్చిన టర్న్ అరౌండ్ విధానానికి ఇప్పటి వరకు 30,231 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అయినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని జయంత్ సిన్హా పేర్కొన్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications