ఇది బిజెపి పార్టీ పండుగ కాదు, ఆలోచించండి'
జిఎస్టీ ఆవిష్కరణల వేడుకలకు హాజరయ్యే అంశంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు పునరాలోచించుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం సూచించారు.
న్యూఢిల్లీ: జిఎస్టీ ఆవిష్కరణల వేడుకలకు హాజరయ్యే అంశంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు పునరాలోచించుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం సూచించారు.
జిఎస్టీకి ముందు, తర్వాత ధరలు ఇలా..
దేశ వ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలనే లక్ష్యంతో కేంద్రంప్రతిష్ఠాత్మంగా భావించి తీసుకొస్తున్న చారిత్రక జీఎస్టీ ఆవిష్కరణ వేడుకలు ఈ అర్ధరాత్రి ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
అయితే, ఈ వేడుకల్లో పాల్గొనబోమని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో వెంకయ్య శుక్రవారం స్పందించారు. ఈ చారిత్రక జీఎస్టీ ప్రారంభ వేడుకల్లో పాల్గొనే అంశంపై కాంగ్రెస్ పునరాలోచించుకోవాలన్నారు.
దేశంలో తీసుకు వస్తున్న విప్లవాత్మకమైన సంస్కరణల నుంచి కాంగ్రెస్ దూరంగా వెళ్తుండటం దురదృష్టకరమన్నారు. ఈ సాయంత్రంలో వారు పునరాలోచించుకొని, ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారనే విశ్వాసం తమకు ఉందన్నారు. ఇదేం పార్టీ కార్యక్రమం కాదన్నారు.