బ్రెజిల్ అమ్మాయితో గుజరాత్ అబ్బాయి "లవ్ స్టోరీ".. ఇన్ స్టాలో వైరల్ !
విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. 2020... ప్రపంచం కరోనా మహమ్మారి భయంతో మూసుకుపోయిన రోజులు. రహదారులు వెలవెలబోయాయి, ప్రజల్లో భయం నిండిపోయింది. కానీ ప్రేమకు దేశాలు, సంస్కృతులు, భాషలు, సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపించింది ఓ జంట. ఒకవైపు బ్రెజిల్లోని టైనా షా, మరోవైపు భారత్లోని గుజరాత్ యువకుడు... వీరిద్దరి కథ మొదట ఆన్లైన్ పరిచయంతో మొదలై.. చివరికి పెళ్లి బంధంతో రెండు ఖండాల మధ్య వారధి కట్టింది. ఈ రియల్స్టోరీ ఇప్పుడంతా సినిమా కథలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచం మొత్తం లాక్డౌన్లో వణికిపోతున్న వేళ.. ఆన్లైన్ లో పరిచయం అయిన బ్రెజిల్ అమ్మాయి కోసం.. గుజరాత్ యువకుడు ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రేమ నిజమని నిరూపించుకోవడానికి, ప్రాణాల మీదకు తెచ్చుకుని బ్రెజిల్ వరకు ప్రయాణించాడు. వైరస్ భయం, అరుదైన విమాన టికెట్లు, ప్రయాణంలో ఉన్న అడ్డంకులు అన్నీ అతన్ని ఆపలేకపోయాయి. "ప్రాణాలకు ముప్పు ఉన్నా, నేను వస్తాను" అన్న ఆ ఒక్క మాటే వారి ప్రేమ ఎంత గొప్పదో నిరూపించింది. ఆ క్షణం నుంచి వారి బంధం మరింత బలపడింది.

ఐదు నెలల్లో పెళ్లి పీటలు..
ఆ కలయిక తర్వాత ఈ జంట విడిపోలేకపోయింది. కేవలం ఐదు నెలలలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి కేవలం వేడుకగా కాకుండా రెండు సంస్కృతుల కలయికగా మారింది. బ్రెజిల్లో జరిగిన ఆ వివాహానికి భారత యువకుడి కుటుంబం మొదటి నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అమ్మాయి తరపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ జంట ఒక్కటయ్యారు.
టైనా ఎమోషనల్ పోస్ట్..
ఈ మేరకు తమ జీవితయాత్రను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న టైనా ఇలా రాసుకొచ్చింది. "మేము వేర్వేరు సంస్కృతుల నుంచి వచ్చినా మా విలువలు ఒక్కటే. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం రోజురోజుకు పెరుగుతోంది. మా ఆత్మలను కలిపిన ఈ విశ్వానికి కృతజ్ఞతలు. రాసిపెట్టి ఉన్న ప్రేమకు ఎక్కువ సమయం పట్టదు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. వేలాది లైకులు, వందలాది కామెంట్లు వెల్లువెత్తాయి. ప్రేమ ఎక్కడున్నా ప్రేమే, దేశాల మధ్య సరిహద్దులు అడ్డుకావు" అంటూ ఒకరు స్పందించగా, "అద్భుతమైన జంట.. దేవుడు మీపై తన దీవెనలు కురిపించాలని కోరుకుంటున్నాం" అని మరొకరు వ్యాఖ్యానించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications