Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తుపాకుల మోత: డిప్యూటీ సీఎం స్వాగతంలో బుల్లెట్ల వర్షం!

బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతల విషయంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్డీఏ నాయకులు చట్ట పాలన స్థాపిస్తామని చెబుతుంటే.. ఆర్జేడీ ప్రతిరోజూ క్రైమ్ బులిటెన్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఒక వీడియో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ పర్యటన సందర్భంగా ఆయన మద్దతుదారులు బహిరంగంగా జరిపిన కాల్పుల వీడియో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.ఇందులో మద్దతుదారులు బహిరంగంగా ఆయుధాలు ఊపుతూ, గాలిలో కాల్పులు జరుపుతూ కనిపించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ్ సిన్హా బదహియాలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.

హర్ష్ ఫైరింగ్ (ఉత్సవాల సందర్భంగా జరిపే కాల్పులు) చట్టవిరుద్ధం అయినప్పటికీ.. స్వయంగా డిప్యూటీ సీఎం సమక్షంలో జరిగిన ఈ ఘటనపై ఆర్జేడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ సంఘటన శాంతిభద్రతల నిర్వహణపై ప్రశ్నలు రేకెత్తుతోంది. ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన ప్రభుత్వం మాటలు, చేతలకు మధ్య ఉన్న తేడాను ఎత్తిచూపుతోంది.

Gunfire at Bihar Deputy CM Roadshow Viral Video Sparks Political Storm

రోడ్‌షోలో బుల్లెట్ల వర్షం
ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి విజయ్ సిన్హా లఖిసరాయ్‌లోని బదహియాకు చేరుకుని రోడ్ షో నిర్వహించారు. వైరల్ అవుతున్న వీడియో ఫుటేజ్‌లో ఉప ముఖ్యమంత్రి తన వాహనం పైన నిలబడి ప్రసంగిస్తుండగా.. అతని మద్దతుదారులు దానికి చుట్టూ నిలబడి గాలిలోకి తుపాకులు ఊపుతూ, నిరంతరంగా కాల్పులు జరిపారు. మద్దతుదారులు బుల్డోజర్‌లను ఉపయోగించి పూల వర్షం కురిపించారు. అయితే, ఆయుధాల ప్రదర్శన, కాల్పులతో ఈ స్వాగతం భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించింది.డిప్యూటీ సీఎం వంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సమక్షంలో బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించడం, ఆ సమయంలో పోలీసులు మౌనంగా ఉండటం బీహార్‌లో శాంతిభద్రతలపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

ఆర్జేడీ ఘాటు కౌంటర్
ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ ఈ వీడియోను ఆయుధంగా వాడుకుంది. అధికారిక 'ఎక్స్' ఖాతాలో ప్రభుత్వంపై అత్యంత ఘాటైన విమర్శ చేసింది. "కాల్పులు జరపండి! దోనాలి (రెండు నాళాల తుపాకీ) చూపించండి! ప్రజలను భయపెట్టండి! ఇది సుపరిపాలన ప్రభుత్వం కాదు, బడబోలే దుశ్శాసన్ ప్రభుత్వం వచ్చింది. ఇక ఐదేళ్లు పాత కట్టుకథలపై ప్రసంగాలు వినడం తప్ప ఈ ప్రభుత్వం ఇంకేమీ చేయలేదు." అని ఆర్జేడీ ఘాటు కౌంటర్ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+